hyderabadupdates.com Gallery గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం

గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం

గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. అప్పుడు కృష్ణా డెల్టాకు నీటి సమస్య రాదన్నారు. గతంలో ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే గత పాలకుడు గోదాట్లో కలిపేశాడని ఆరోపించారు. రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ వాల్ ను ముంచేశాడని మండిప‌డ్డారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర సహకారంతో రూ.1000 కోట్లతో చేపట్టి పూర్తి చేశాం అన్నారు సీఎం. కొందరు నిర్మించిన వాటిని మరికొందరు కూలుస్తుంటారని అన్నారు. మళ్లీ వాటి పునర్నిర్మాణం చేయటం జరుగుుతందని చెప్పారు. పోలవరం, అమరావతి రాజధానిని మళ్లీ పునర్నిర్మించే అవకాశం నాకు వచ్చిందన్నారు. రూ.4,660 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయకుండా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశాం అన్నారు. భవిష్యత్తులోనూ కరెంటు చార్జీలను పెంచేది లేదన్నారు.
గత పాలకులు 9 సార్లు కరెంటు ఛార్జీలు వేసి రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం వేశారని ఆరోపించారు సీఎం. సోలార్ రూఫ్ టాప్‌తో ప్రోజ్యూమర్ అనే విధానాన్ని తీసుకు వస్తున్నాం అన్నారు. సామాన్యులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. గంజాయి రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని పేర్కొన్నారు. హాస్టళ్లు, బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు మధ్యాహ్న భోజనం తదితర అంశాల్లో మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం అన్నారు. రూ.వెయ్యి కోట్ల ఆదాయం కోల్పోతున్నా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామ‌ని తెలిపారు.
The post గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలుప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన స్థ‌లాల‌లో ఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డ‌డ‌మే కాకుండా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డంపై ఫోక‌స్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌లు సృష్టించారు క‌బ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్‌తో

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం

భారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలిభారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి

అమ‌రావ‌తి : భార‌త దేశం ఔన్న‌త్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువల‌ను ప్ర‌త్యేకంగా విద్యార్థుల‌కు తెలియ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ , ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కొణిద‌ల‌. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సోమ‌వారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు