hyderabadupdates.com Gallery గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి post thumbnail image

ఢిల్లీ : మొజాంబిక‌న్ సామాజిక కార్య‌క‌ర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇందిరాగాంధీ శాంతి బహుమ‌తి ద‌క్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని గెలుచుకున్నారు. ఆఫ్రికా, అంతకు మించి అణగారిన వర్గాలు , సామాజిక న్యాయంపై ఆమె ప్రభావాన్ని ఈ అవార్డు గుర్తిస్తుంది. 2025 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని మొజాంబికన్ హక్కుల కార్యకర్త గ్రాకా మాచెల్ కు ప్రదానం చేస్తున్నట్లు జ్యూరీ వెల్ల‌డించింది. బుధవారం అవార్డుకు ప్రకటించిన జ్యూరీ తెలిపింది. క్లిష్ట పరిస్థితులలో విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారం, ఆర్థిక సాధికారత, మానవతావాద రంగంలో ఆమె చేసిన అద్భుతమైన కృషికి గాను
ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన‌ట్లు మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ జ్యూరీ వెల్ల‌డించారు. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ , అభివృద్ధి బహుమతికి సంబంధించి రూ. కోటి నగదు, ప్రశంసా పత్రంతో కూడిన ట్రోఫీ బ‌హూక‌రిస్తారు. మాచెల్ ఒక విశిష్ట ఆఫ్రికన్ రాజనీతిజ్ఞురాలు, రాజకీయ నాయకురాలు, మానవతావాదిగా గుర్తింపు పొందారు, ఆమె జీవితాంతం స్వయం పాలన, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటంలో పాతుకు పోయిందని జ్యూరీ చైర్మ‌న్ ప్ర‌క‌టించింది.
The post గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్రక్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర

అమ‌రావ‌తి : క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర సృష్టించింద‌ని అన్నారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాకినాడలో రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌ ఏర్పాటు కావడం శుభసూచకం

20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి

ఢిల్లీ : టీవీకే పార్టీ చీఫ్‌, తమిళ సినీ రంగంలో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే విజ‌య్ న‌టించిన జ‌య నాయ‌గ‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా చిత్రానికి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎంతిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా