hyderabadupdates.com Gallery గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : దేశంలో గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఏపీ మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం ఏపీలోని కాకినాడ‌లో ఏఎం గ్రీన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు పునాది వేశారు. ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు మాట్లాడారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఏపీ ఒక కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. అక్టోబర్ 2024లో రాష్ట్ర సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయ‌న మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తమ దార్శనికతను ప్రభుత్వం స్పష్టంగా తెలియ జేసిందని ముఖ్యమంత్రి అన్నారు.
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు పరికరాల ఏర్పాటు పనులు ప్రారంభం కావడాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారుగా మార్చడంలో ఒక కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. తర్లవాడలో గూగుల్ కోసం భూసేకరణ వేగవంతం జ‌రుగుతోంద‌న్నారు. సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులో 7.5 గిగావాట్ల సౌర , పవన విద్యుత్ సామర్థ్యం, ​​అలాగే 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ కేంద్రం ఉన్నాయని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవన్నీ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంద‌న్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన పర్యావరణ వ్యవస్థ బలాన్ని ప్రదర్శిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తార‌ని తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు అని పేర్కొన్నారు సీఎం.
The post గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటుNDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

    బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి చిరాగ్‌

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్

    నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్‌రావు సంచలన విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేశ్‌ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించాడు. ‘‘ఏప్రిల్‌లో

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.