hyderabadupdates.com Gallery గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : దేశంలో గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఏపీ మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం ఏపీలోని కాకినాడ‌లో ఏఎం గ్రీన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు పునాది వేశారు. ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు మాట్లాడారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఏపీ ఒక కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. అక్టోబర్ 2024లో రాష్ట్ర సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయ‌న మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తమ దార్శనికతను ప్రభుత్వం స్పష్టంగా తెలియ జేసిందని ముఖ్యమంత్రి అన్నారు.
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు పరికరాల ఏర్పాటు పనులు ప్రారంభం కావడాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారుగా మార్చడంలో ఒక కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. తర్లవాడలో గూగుల్ కోసం భూసేకరణ వేగవంతం జ‌రుగుతోంద‌న్నారు. సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులో 7.5 గిగావాట్ల సౌర , పవన విద్యుత్ సామర్థ్యం, ​​అలాగే 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ కేంద్రం ఉన్నాయని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవన్నీ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంద‌న్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన పర్యావరణ వ్యవస్థ బలాన్ని ప్రదర్శిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తార‌ని తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు అని పేర్కొన్నారు సీఎం.
The post గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలిడీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో మరింతగా ఉత్తరాది

పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌పేద‌ల కోసం మోడ‌ల్ కాల‌నీ నిర్మిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితుల‌కు భ‌రోసా ఇచ్చారు. పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్ర‌క‌టించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్

తిరుపతి : ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి