hyderabadupdates.com Gallery చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌ post thumbnail image

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే బూతులు. అస‌లు ఇది కోరి తెచ్చుకున్న తెలంగాణానా లేక ఆంధ్రానా అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఈ త‌రుణంలో స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా చంద్ర‌హాస్ పాట పాడుతున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తితో పాటు చంద్ర‌హాస్ తండ్రి ప్ర‌భాక‌ర్ కూడా ఉన్నాడు. వారితో పాటు సినీ రంగానికి చెందిన వారితో పాటు మ‌హిళ‌లు కూడా ఉండ‌డం విశేషం.
సోష‌ల్ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లో తీవ్ర ఆగ్ర‌హం, వ్య‌తిరేకత వ్య‌క్తం కావ‌డంతో బ‌రా బ‌ర్ ప్రేమిస్తా నిర్మాత‌లు సైతం తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇంకా విడుద‌ల కాకుండానే ఇలాంటి ట్రోల్స్ కు గురి కావ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా చంద్ర‌హాస్ అశ్లీల పాట‌పై తీవ్రంగా స్పందించాడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి. గురువారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. ఇలాంటి పాట‌లు స‌భ్య స‌మాజాన్ని ప్ర‌భావితం చూపిస్తాయ‌ని, ఇది విలువ‌లకు మంగ‌ళం పాడేలా ఉంద‌ని ఫైర్ అయ్యాడు. టెలివిజన్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక అశ్లీల పాటను రాసి బహిరంగంగా పాడాడు. ఆ త‌ర్వాత వివాదంలోకి దిగాడు. సత్య, శివ, వాస్తు శాస్త్రం వంటి హిందీ చిత్రాలలో కీ రోల్స్ పోషించిన జేడీ సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఇటువంటి ప్రవర్తన గుర్తింపు కోసం కష్టపడి పనిచేసే నిజమైన కళాకారుల గౌరవాన్ని దెబ్బ తీస్తుంద‌న్నారు.
The post చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తిIndia: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తి

    మయన్మార్‌లో స్కామ్‌ సెంటర్‌ నుంచి పరారై సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్‌ పట్టణం మే సొట్‌లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకువచ్చింది. మయన్మార్‌లోని

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదంTG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

    జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న

Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలుSudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు

  సూడాన్‌ సైన్యం, సూడాన్‌ పారామిలటరీ విభాగాల మధ్య నెలల తరబడి జరుగుతున్న అంతర్యుద్దంతో రావణకాష్టంగా కాలిపోతున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన, బందీలుగా మారిన భారతీయులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌ లో సూడాన్‌