hyderabadupdates.com Gallery చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు

చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు

చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు post thumbnail image

హైద‌రాబాద్ : బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టి. చిరంజీవులకు “మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు – 2026” ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా త‌న‌పై ఈ పుర‌స్కారం మ‌రింత బాధ్య‌త‌ను పెంచేలా చేసింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా సమ సమాజ స్థాపన కోసం కుల ఆధారిత అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన మహానీయ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వి. హనుమంతరావు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు పూలే చేసిన కృషి అపారమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ శాసనసభ తొలి సభాపతి, శాసనమండలి సభ్యులు సిహెచ్ మధుసూదనాచారి మాట్లాడుతూ పేదల మరియు శూద్రుల హక్కుల కోసం పోరాడిన పూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆయన జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని కోరారు.
రిటైర్డ్ డిజిపి, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కన్వీనర్ పూర్ణచందర్రావు మాట్లాడుతూ చదువు అనే ఆయుధంతో సామాజిక గౌరవాన్ని సాధించడంలో పూలే ప్రేరణగా నిలిచారని అన్నారు. అదే మార్గంలో టి. చిరంజీవులు బీసీ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ పొలిటికల్ ఫ్రెండ్స్ చైర్మన్ బి. బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని పేర్కొన్నారు. తెలంగాణ బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ టి. చిరంజీవులు మాట్లాడుతూ బీసీ ఐక్యత కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని అన్నారు. పోరాటాల ద్వారా హక్కులను సాధించేందుకు అన్ని వర్గాలను ఒకే వేదిక పైకి తీసుకు వస్తానని అన్నారు. తాను రచించిన పుస్తకాలు, ప్రసంగాల ద్వారా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా. రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిభావంతుడైన ఒకరికి ప్రదానం చేసే “మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు – 2026” కు ఈ సంవత్సరం బీసీ మేధావుల ఫోరం చైర్మన్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామని తెలిపారు.
The post చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను త‌న సార‌థ్యంలో రెండుసార్లు విశ్వ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని, త‌మ కుర్రాళ్లు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక మ్యాచ్ లో కీల‌క భూమిక

ద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలిద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్ప‌ష్టం చేశారు. సివిల్స్ ప‌రీక్ష‌ల‌తో పాటు గ్రూప్ –1,

ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ

దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొన్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు, తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి