hyderabadupdates.com Gallery చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్

చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్

చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్ post thumbnail image

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు, వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం దివంగ‌త రాజ‌కీయ నేత రామ్ విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నార‌ని సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. దీనిపై తాజాగా స్పందించారు ఎంపీ కంగ‌నా ర‌నౌత్. తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని, అంత‌కు మించి తామిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ అనేది లేనేలేద‌ని స్ప‌ష్టం చేసింది న‌టి. ఇదంతా ఎవ‌రో కావాల‌ని త‌న‌పై ప్ర‌చారం చేస్తున్నారంటూ వాపోయింది కంగ‌నా ర‌నౌత్.
అయితే అగర్ ఐసా హోతా తో ఆజ్ హుమారే బచ్చే హోతే అంటూ పేర్కొన్నారు. రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన తోటి రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌తో తనకున్న సంబంధంపై కొనసాగుతున్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. కాగా ప్రత్యేకించి ఇద్దరూ పబ్లిక్ ఈవెంట్‌లలో కలిసి కనిపించారు. దీంతో అభిమానులలో మ‌రింత‌ ఆసక్తిని రేకెత్తించారు. అయితే, కంగనా ఇప్పుడు ఈ కబుర్లను నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాజాగా జాతీయ మీడియా ఏఎన్ ఐ ఛానల్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది. రొమాన్స్ అనేది త‌న‌తో లేద‌ని స్ప‌ష్టం చేసింది. చిరాగ్ పాశ్వాన్ త‌న‌కు స్నేహితుడ‌ని కానీ ల‌వ‌ర్ మాత్రం కాద‌న్నారు.
The post చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ

విజ‌య‌వాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక

ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రుప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రు

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ శ‌నివారం మ‌రాఠా లోని బివాండి కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని కోరుతూ కేసు దాఖ‌లు చేసింది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్.

టీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలిటీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలి

మంగ‌ళ‌గిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు దిగ‌వ‌ద్ద‌ని , కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , సీఎం