hyderabadupdates.com movies జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ, నదీ తీర ప్రాంతంలో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. అమరావతి కేవలం భౌగోళిక అంశం కాదని, ప్రజల త్యాగాలు, ఆకాంక్షలతో ముడిపడిన అంశమనే భావనను జగన్ వ్యాఖ్యలు విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని వంటి నేతలు రంగంలోకి దిగి, జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.

జగన్ అమరావతిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని, పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తక్కువ చేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే ఈ వివరణలు ప్రజల అసంతృప్తిని పూర్తిగా చల్లార్చలేకపోతున్నాయి.

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలు రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ అప్పట్లో వైసీపీ తన వైఖరిని మార్చలేదు.

2024 ఎన్నికల తర్వాత అమరావతే రాజధాని అన్న మాటలు వైసీపీ నేతల నుంచి వినిపించాయి. అయితే తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. దీంతో వైసిపి.. జగన్ అలా చెప్పలేదంటూ ఎవరు నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది.

Related Post

థ్యాంక్యూ.. స‌జ్జ‌నార్ స‌ర్‌: సినీ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం!థ్యాంక్యూ.. స‌జ్జ‌నార్ స‌ర్‌: సినీ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం!

తెలుగు సినీ రంగంలోని పెద్ద‌ల క‌ళ్ల‌లో ఇటీవ‌ల కాలంలో లేనంత ఆనందం క‌నిపించింది. పైర‌సీ భూతంగా మారి.. సినీ రంగానికి స‌వాల్ విసిరిన ఇమ్మ‌డి ర‌విని హైద‌రాబాద్ పోలీసులు, సైబ‌ర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దీంతో తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు

‘వాళ్ళ’ రాజాసాబ్ ఫ్లాప్ అవ్వాల‌న్న కోరిక‌పై మారుతి..‘వాళ్ళ’ రాజాసాబ్ ఫ్లాప్ అవ్వాల‌న్న కోరిక‌పై మారుతి..

పైకేమో ఇండ‌స్ట్రీలో అంద‌రూ బాగుండాలి.. అన్ని సినిమాలు ఆడాలి అంటూ సినీ జ‌నాలు స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ.. తెర వెనుక మాట‌లు వేరే ఉంటాయ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. పోటీ ఉన్న‌పుడు అవ‌త‌లి సినిమా పోవాల‌ని కోరుకునేవాళ్లే ఎక్కువ‌మంది ఉంటారు. కొన్ని