అమరావతి : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తనకు ఏపీపై ప్రేమ లేదన్నారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. పూటకో ఈవెంట్ తో వైసిపి నేతలు తమ కరపత్రికను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోర్టుల పురోగతిపై రివ్యూ చేస్తూ ఉన్నారని చెప్పారు. ఎంతో కష్టపడితే తప్పా అమరావతికి లైన్ క్లియర్ కాలేదన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. 2024 జూన్ నాటికి పోర్టు భౌతిక పురోగతి.. మొత్తం 25.02 % గా ఉండగా.. ప్రస్తుతం 74.65 % పనులు శరవేగంగా పూర్తి చేశామని చెప్పగలం అన్నారు… గత 20 నెలల్లో దాదాపు 49.63 % పనులు పూర్తి చేశాం అన్నారు.
ఆర్థిక పురోగతి 2019–24 లో రూ. 718.50 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ. 1835.98 కోట్ల మేర పనులు చేపట్టడం జరిగిందన్నారు. మొత్తంగా గత 20 నెలల పాలనలో రూ. 1117.48 కోట్లు వెచ్చించానని తెలిపారు. పోర్టుకు సంబంధించి ఉప్పు భూముల సేకరణ విషయంలో నాటి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎటువంటి ప్రయత్నం చేసిన పాపాన పోలేదన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, 385.24 ఎకరాల భూసేకరణకు అనుమతి పొందడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూలాపేట, విష్ణుచక్రం గ్రామాల్లో పునరావాసం కోసం సీరియస్ గా ఎటువంటి చర్యలు చేపట్ట లేదన్నారు మంత్రి. గత 20 నెలల కూటమి ప్రభుత్వంలో విష్ణుచక్రం గ్రామంలో పూర్తిగా పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. అలాగే మూలపేట గ్రామంలో పునరావాసం పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయన్నారు.
The post జగన్ రెడ్డివన్నీ అబద్దాలే : జనార్దన్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
జగన్ రెడ్డివన్నీ అబద్దాలే : జనార్దన్ రెడ్డి
Categories: