hyderabadupdates.com movies టార్గెట్ 2028: విశాఖ‌పై బాబు స్ట్రాట‌జీ.. !

టార్గెట్ 2028: విశాఖ‌పై బాబు స్ట్రాట‌జీ.. !

సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌దును పెరుగుతోంది. రోజురోజుకు ఆయ‌న త‌న ల‌క్ష్యాల‌ను మార్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా విశాఖ ప‌ట్నంపై మ‌రిన్ని ఆశ‌లు, ఆశ‌యాల‌తో సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. విశాఖ‌ను రాజ‌ధానిని చేస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఎంత లేద‌న్నా.. చాలా మంది ఈ ప్ర‌క‌ట‌నను స్వాగ‌తించారు. త‌మ న‌గరం బాగుప‌డుతుంద‌ని కూడా అనుకున్నారు.

ఈ క్ర‌మంలో అదేస్థాయిలో సీఎం చంద్ర‌బాబు కూడా ఆలోచ‌న చేస్తున్నారు. జ‌గ‌న్ ఉంటే.. విశాఖ బాగుండేది అనే మాట వినిపించ‌కుండా చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు విశాఖ న‌గ‌రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దేందుకు వీలుగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా `టార్గెట్ 2028 @ విశాఖ‌` అంశాన్ని చంద్రబాబు ఆవిష్క‌రించారు. అంటే.. 2028 నాటికి విశాఖ న‌గ‌రాన్ని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల న్నది ఆయ‌న ప్ర‌ణాళిక‌. దీనిలో భాగంగా కేవ‌లం పెట్టుబ‌డుల‌కే ప‌రిమితం కాబోర‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది.

విశాఖ‌ను రాబోయే రోజుల్లో అత్యుత్త‌మ న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఐటీ స‌హా ప‌ర్యాట‌కం, పారిశ్రామికంగా కూడా న‌గ‌రాన్ని తీర్చి దిద్దేందుకు న‌డుం బిగించారు. త‌ద్వారా 2028 నాటికి బెస్ట్ సిటీగా విశాఖ‌ను మార్చ‌నున్నారు. ముఖ్యంగా ఐటీ, పారిశ్రామికీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. 2028 నాటికి ఐటీలో ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. అదేవిధంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ ద్వారా అన‌కాప‌ల్లిలో భారీ ఐర‌న్ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా రైడెన్ సంస్థ‌కు అనుమ‌తులు ఇచ్చారు. ఈ సంస్థ 87 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డుల‌తో ఇన్ఫోటెక్ డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. త‌ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఇక, ఇప్ప‌టికే ప‌ర్యాట‌కానికి ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖ‌లో ప‌ర్యాట‌క బ‌స్సుల‌ను కూడా ప్రారంభించారు. త్వ‌ర‌లోనే సీ కేబుల్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురాన్నారు. త‌ద్వారా.. మ‌రింత‌గా విశాఖ అభివృద్ధి చెందుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు.

Related Post

ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మామూలు

‘జూబ్లీహిల్స్‌’పై నివేదిక‌లు.. అస‌లు స్ట్రాట‌జీ ఇదేనా?‘జూబ్లీహిల్స్‌’పై నివేదిక‌లు.. అస‌లు స్ట్రాట‌జీ ఇదేనా?

హైదరాబాద్‌లోని కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్‌. దీనికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ సంద‌డి కొన్నాళ్ల కింద‌టే ప్రారంభ‌మైంది. అయితే, ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేరువ అవుతున్న నేప‌థ్యంలో ఈ రాజ‌కీయ సంద‌డిమ‌రింత దుమ్మురేప‌నుంది. ఇప్పటికే ప్ర‌ధాన‌