hyderabadupdates.com Gallery టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌ post thumbnail image

లాహోర్ : ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భార‌త్, శ్రీ‌లంక దేశాలు. ఈ సంద‌ర్బంగా భార‌త్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ త‌రుణంలో తాము భ‌ద్రతా కార‌ణాల రీత్యా ఆడ‌టం లేదంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). ఆ బోర్డుకు మ‌ద్ద‌తుగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈమేర‌కు భారీ ఎత్తున న‌ష్ట పోయే ఛాన్స్ ఉంద‌ని ఇప్ప‌టికే ఆ దేశం గుర్తించింది. మ‌రో వైపు పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు ఇంకా కొంత స‌మ‌యం కావాల‌ని అన్నారు.
ఇప్ప‌టికే ఐసీసీ టీ20 టోర్న‌మెంట్ లో పాల్గొనలా లేదా వ‌ద్దా అనే దానిపై అనుమ‌తి ఇవ్వాల్సింది పాకిస్తాన్ దేశ అధ్య‌క్షుడ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు. దీంతో పాకిస్తాన్ ఎంట్రీపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో వైపు పాకిస్తాన్ ఈ టోర్నీ త‌ర్వాత కొలంబోకు వెళ్లాల్సి ఉంది. శ్రీ‌లంక‌తో జ‌రిగే సీరీస్ లో పాల్గొనాల్సి ఉంద‌న్నారు న‌ఖ్వీ. ఇదిలా ఉండ‌గా టెలికాస్ట్ స్పాన్స‌ర్షిప్ న‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాము దాదాపు రూ. 354 కోట్లు న‌ష్ట పోతున్నామ‌ని, ఇందుకు గాను త‌మ‌కు చెల్లించాల‌ని కోరుతున్నాయి ఆయా కంపెనీలు. మ‌రో వైపు బంగ్లాదేశ్ జ‌ట్టుకు బ‌దులు మ‌రో జ‌ట్టుకు ఛాన్స్ ఇచ్చింది ఐసీసీ. దీంతో అటు బంగ్లా ఇటు పాకిస్తాన్ ల‌కు ఝల‌క్ ఇచ్చింది.
The post టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ravi Teja’s Mass Jathara ‘Super Duper’ Track Takes the Buzz to New HeightsRavi Teja’s Mass Jathara ‘Super Duper’ Track Takes the Buzz to New Heights

Mass Jathara, a much awaited movie featuring Ravi Teja and Sreeleela, is preparing for a massive cutout with its release on the horizon, and the producers are intensifying their promotions

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తిమ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం