hyderabadupdates.com Gallery టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో post thumbnail image

తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవ‌లే ల‌డ్డూ క‌ల్లీ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. మ‌రో వైపు కల్తీ చోటు చేసుకుందంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సైతం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఆపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు ను ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు రంగంలోకి దిగిన సిట్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది.
ఈ మేర‌కు త‌న‌కు అందిన నివేదిక‌ను తీసుకున్న వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీ చ‌రిత్ర‌లోనే రెండు సార్లు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో)గా నియ‌మించ బ‌డ్డారు సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే టీటీడీ ఆధ్వ‌ర్యంలో వైకుంఠ ఏకాద‌శి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆ వెంట‌నే నివేదిక ఆధారంగా వెంట‌నే ఆనాటి అకౌంట్స్ ఆఫీస‌ర్ బాలీజీని , ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ముద్దాడ ర‌విచంద్ర‌ను ఈవోగా నియ‌మించారు సీఎం. ఇవాళ ర‌విచంద్ర టీటీడీ చైర్మ‌న్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.
The post టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏలూరు జిల్లాలో 500 ఎక‌రాల్లో కోకో సిటీఏలూరు జిల్లాలో 500 ఎక‌రాల్లో కోకో సిటీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. వెంట‌నే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

ముంబై : వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు అరుదైన ఛాన్స్ ల‌భించింది. తాజాగా ప్ర‌ముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను త‌మ కంపెనీకి బ్రాండ్

Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీTejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీ

Tejashwi Yadav : బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అధికారం కోసం ప్రజలపై రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మరో అడుగు ముందుకు వేసి…