hyderabadupdates.com Gallery టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్ post thumbnail image

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. దీంతో త‌న‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. ఇదిలా ఉండ‌గా ఆదాయ వివ‌రాలు వెల్ల‌డించ లేదంటూ ఐటీ శాఖ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు గ‌త ఏడాది త‌న ఇళ్లు, ఆఫీసు, పార్టీ కార్యాల‌యంలో దాడులు చేప‌ట్టింది. ఈ మేర‌కు విజ‌య్ కు రూ. 1.50 కోట్ల జ‌రిమానా విధించింది. కాగా ఐటీ శాఖ జారీ చేసిన జ‌రిమానాపై స‌వాల్ చేస్తూ న‌టుడు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ ఐటీ శాఖ జారీ చేసింది స‌బ‌బేన‌ని అభిప్రాయ‌ప‌డింది. అంతే కాకుండా తక్ష‌ణ‌మే కోటిన్న‌ర రూపాయ‌ల‌ను చెల్లించాల్సిందేన‌ని ఆదేశించింది. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని విజ‌య్ ను హెచ్చ‌రించింది ధ‌ర్మాసనం.
ఈ సంద‌ర్బంగా విజ‌య్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పిటిషన్ 2022లో దాఖలు చేశారు. ఈ జ‌రిమానా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. విజయ్ రూ. 15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది, ఆ తర్వాత జరిమానా విధించింది. ఈ కేసును ఏకసభ్య న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి విచారించారు, ఆయన జనవరి 23, 2026న తన తీర్పును రిజర్వ్ చేశారు. తన ఉత్తర్వులో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం నిర్దేశిత కాలపరిమితిలోనే షోకాజ్ నోటీసు జారీ చేశార‌ని పేర్కొన్నారు. నోటీసు జారీ చేసిన విధానంలో ఎలాంటి లోపం లేదని గమనించిన కోర్టు, కేసులోని ఇతర అంశాలను పరిశీలించడానికి నిరాకరించింది, తద్వారా ఆదాయపు పన్ను శాఖ జరిమానా ఉత్తర్వు యథాతథంగా కొనసాగడానికి అనుమతించింది.
The post టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

BRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలుBRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు

    ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఎన్నిక అనివార్యమవగా… సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది.

Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరిNara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

    ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు

నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాంనీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం

హైద‌రాబాద్ : ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయి. జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాల వ‌ర‌కూ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందస్తు హెచ్చ‌రిక చేశారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేలుకొందామ‌ని అన్నారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో