hyderabadupdates.com Gallery డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత

డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత

డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం అన్నారు. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం అని తెలిపారు. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగు నీటిని అందించాల్సి ఉందన్నారు. ఏపీలో నీటి నాణ్యత ను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించు కోవాలని కోరుతున్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయన్నారు సీఎం. జేజెఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతీ ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమ‌ని స్ప‌ష్టం చేశారు చంద్రబాబు నాయుడు. సాగు కోసం కూడా రైతులకు రెండు సార్లు నీరందితే వారు కూడా సంతోషంగా ఉంటారన్నారు. జేజేఎం 2.0 పై త్వరలో ఏపీలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించు కుందాం అని తెలిపారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్‌లో భాగంగానూ సురక్షిత నీటిని మారుమూల ప్రాంతాలకు అందించేందుకు నిధులు వినియోగించు కోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామ‌ని, ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించు కోవాల‌ని కోరారు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్.
The post డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి హౌస్ అరెస్ట్ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి హౌస్ అరెస్ట్

నిజామాబాద్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి ఎవ‌రు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే తేల్చుకుందాం

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో

Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్

Celina Jaitly : యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ (Celina Jaitly) భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. ఆ పోస్టులో..