hyderabadupdates.com Gallery తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి  న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్ post thumbnail image

తిరుప‌తి : తిరుప‌తి న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం స‌మీక్ష చేప‌ట్టారు. నగర కమిషనర్ మౌర్య‌ , అదనపు కమిషనర్ , అధికారులు పాల్గొన్న సమావేసాశాన్ని ఉద్దేశించి మేయర్ మాట్లాడారు.2026 – 2027 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పన చేసే సందర్భంగా మనం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రీ బ‌డ్జెట్ స‌మావేశానికి ప్రాధాన్య‌త ఉంద‌న్నారు డాక్ట‌ర్ శిరీష‌. గత బడ్జట్ అంచనాలు, అమలు తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు.
2025 … 26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆమోదించిన బడ్జెట్ అంచనాలు తగ్గట్లు ఆదాయం వచ్చిందా లేదా అన్న‌ది కూడా ముఖ్య‌మ‌న్నారు. ముఖ్యంగా పన్నులు ప్రధాన ఆదాయం అని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలపై భారం లేకుండా చూడాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో తిరుప‌తి న‌గ‌రంంలో పెద్ద ఎత్తున వ్య‌క్తిగ‌త‌, సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌లు ఉంటున్నాయ‌ని, వాటి పై ప‌న్నులు విధించ‌డం ద్వారా ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. వివిధ రకాల పన్నులు వసూలు కాకపోతే అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషించాల‌ని అన్నారు. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో కౌన్సిల్ ఆమోదించిన ప్రాధాన్యత క్రమంలో నిధుల ఖర్చు చేశామా లేదా అన్నది సవివవరంగా కౌన్సిల్ ముందు ఉంచాలని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్.
The post తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

దాడుల‌ను స‌హించం తిప్పి కొట్ట‌డం ఖాయందాడుల‌ను స‌హించం తిప్పి కొట్ట‌డం ఖాయం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్యక‌ర్త‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై దాడులు చేసినా, ఎవ‌రు పాల్ప‌డినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జనగామ పట్టణంలో త‌మ పార్టీ ఎమ్మెల్యే

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందిTG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

    తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు