hyderabadupdates.com Gallery తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం post thumbnail image

​కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్‌షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. ఆదివారం త‌న‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుబట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
గుంటూరులో టిడిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు సృష్టించిన గొడవను నానాజీ తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పులు బయట పడుతున్నాయనే భయంతోనే అంబటి ఇలాంటి “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం వాడటం అంబటి అహంకారానికి నిదర్శనమని, దీనికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. తిరుమల ప్రతిష్టను గంగలో కలిపిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని పంతం నానాజీ స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని, అంబటి రాంబాబు లాంటి వారు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని నానాజీ పేర్కొన్నారు.
The post తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలిటీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలి

మంగ‌ళ‌గిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు దిగ‌వ‌ద్ద‌ని , కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , సీఎం

PM Narendra Modi: భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీPM Narendra Modi: భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ

భూటాన్‌ అభివృద్ధికి సహకరిస్తాం – ప్రధాని మోదీ   భూటాన్‌ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్‌ 13వ పంచవర్ష(2024–2029) ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోదీ భూటాన్‌ పర్యటన రెండో రోజు

తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాంతెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాము ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి కాంట్రాక్టర్లకు కాకుండా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు .