hyderabadupdates.com Gallery తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం

తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం

తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం :  సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భ వేదిక‌గా ఆయ‌న ప్ర‌సంగించారు. సాగు నీటి రంగంపై ప్ర‌సంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 2047 విజన్ లో భాగంగా నీటి భద్రతపైనే కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత త‌మ‌ ప్రభుత్వానికే వచ్చిందని చెప్పారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నాం అన్నారు. గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది నా ప్రగాఢమైన ఆకాంక్ష అని తెలిపారు. గంగా-కావేరి అనుసంధానం సాధ్యా సాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని చెప్పారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం స్ప‌ష్టం చేశారు సీఎం. హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువల విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చామ‌న్నారు. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చామ‌న్నారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో వచ్చినవేన‌ని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు.
The post తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌ల‌మే జీవ‌నాధారం లేక‌పోతే మ‌నుగ‌డ క‌ష్టంజ‌ల‌మే జీవ‌నాధారం లేక‌పోతే మ‌నుగ‌డ క‌ష్టం

అమ‌రావ‌తి : ‘జలమే జీవం… జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాల‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యలు నుంచి

Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలుVijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలు

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యా (Vijay Mallya)… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలుశ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 10, 24వ