hyderabadupdates.com Gallery తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం

తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం

తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం :  సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భ వేదిక‌గా ఆయ‌న ప్ర‌సంగించారు. సాగు నీటి రంగంపై ప్ర‌సంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 2047 విజన్ లో భాగంగా నీటి భద్రతపైనే కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత త‌మ‌ ప్రభుత్వానికే వచ్చిందని చెప్పారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నాం అన్నారు. గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది నా ప్రగాఢమైన ఆకాంక్ష అని తెలిపారు. గంగా-కావేరి అనుసంధానం సాధ్యా సాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని చెప్పారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం స్ప‌ష్టం చేశారు సీఎం. హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువల విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చామ‌న్నారు. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చామ‌న్నారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో వచ్చినవేన‌ని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు.
The post తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటుIPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

IPS officer : హరియాణాలోని సీనియర్‌ ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : అగ్ని ప్ర‌మాదాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌ని హాస్ట‌ళ్ల నిర్వాహ‌కుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వ‌స్తున్న‌ది వేస‌వి కాలం అని, ఎక్క‌డ ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా పెనుముప్పు సంభ‌విస్తుందని

ఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాంఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాం

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాసనసభ బడ్జెట్ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి మ‌నోహ‌ర్ తో క‌లిసి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో, ఉప ముఖ్యమంత్రి