hyderabadupdates.com Gallery దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్

దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్

దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్ post thumbnail image

హైద‌రాబాద్ : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు అఖిల్ అక్కినేని, అందాల ముద్దుగుమ్మ భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన లెనిన్ చిత్రంపైనే ఉన్నాయి. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీకి సంబంధించి న్యూ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ వెంట‌నే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది యెట్ట యెట్టా సాంగ్. ఈ పాట‌కు పోటీప‌డి న‌టించారు అఖిల్, బోర్సేలు. హిట్ సాంగ్స్ కేట‌గిరీలోకి చేరి పోయింది ఈ పాట‌. ఈ ప్రధాన జంట సినిమా షూటింగ్ సమయంలో ఎంతగానో సందడి చేశారని అర్థమవుతోంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమా నుండి రెండవ పాట అయిన యెట్ట యెట్టాను విడుదల చేశారు .
ఈ పాట ప్రధానంగా ఈ జంట మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీపైనే ఆధారపడి విజయవంతమైంది. ఒక సహజమైన, గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ ఆకట్టుకునే పాటలో, భాగ్యశ్రీ ఉల్లాసభరితమైన అందం, అఖిల్ యొక్క మాస్ డాన్స్ స్టెప్స్‌కు చక్కటి జోడిలా నిలిచింది.తమన్ స్వరపరిచిన ఈ ఉత్సాహ భరితమైన డాన్స్ నంబర్, ఆకట్టుకునే బీట్స్, ఉరకలేసే శక్తితో నిండి ఉంది, ఇది పాటను మరింత ఆసక్తికరంగా మార్చేలా చేసింది. ఇక లెనిన్ లోని మొద‌టి పాట వారేవా వారేవా కూడా బిగ్ హిట్ గా నిలిచింది. ముర‌ళి కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ వ‌చ్చే జూన్ 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సే.
The post దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానంబ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. భ‌క్తుల‌తో అల‌రారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యం. ఈనెల‌లో శివ రాత్రి ప‌ర్వ‌దినం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆల‌య

ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లుఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో వ్య‌వసాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ‌, అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం

జిల్లాలను ప్రమోట్ చేయండి పెట్టుబడులను ఆకర్షించండిజిల్లాలను ప్రమోట్ చేయండి పెట్టుబడులను ఆకర్షించండి

అమరావతి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా… జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు