hyderabadupdates.com Gallery దేవుడిపై బురదచల్లుడా.. ఇంతకంటె నీచముంటుందా?

దేవుడిపై బురదచల్లుడా.. ఇంతకంటె నీచముంటుందా?

ప్రచారం చేసేవన్నీ అబద్ధాలే. అందులోనూ కుదిరినప్పుడు.. అధికారికంగా, నాయకులే మీడియా ముందుకు వచ్చి దైవద్రోహం చేస్తున్నామనే పాపభీతి కూడా లేకుండా పనిగట్టుకుని అబద్ధాలను ప్రచారం చేయడానికి బరితెగిస్తారు. కుదరని సందర్భాల్లో దొంగచాటుగా, ముసుగులేసుకుని, తప్పుడుప్రచారాలని సోషల్ మీడియాలో హోరెత్తించడానికి దిగజారుతారు. ఏదిఏమైనా సరే.. ప్రతిరోజూ తిరుమలేశుని భక్తుల్లో రకరకాల భయాలు, అపోహలు పుట్టేలా బురద చల్లుతూ ఉండాల్సిందే. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ఇదే తమ ప్రాథమిక బాధ్యత అన్నట్టుగా చెలరేగుతున్నాయి. ఇలాంటి దుర్మార్గులు సాగించే విషప్రచారాలకు కౌంటర్లు ఇచ్చుకోవడమూ, ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం టీటీడీ వెబ్ సైట్ ను మాత్రమే చూడాలని ప్రతిసారీ ప్రచారం చేసుకోవడం టీటీడీకి అనవసరమైన భారంగా మారుతోంది.తాజాగా సాగుతున్న ఇలాంటి ప్రచారాల్ని గమనిస్తే.. తిరుమలలో వృద్ధులకు ఉచితంగా ప్రత్యేక దర్శన అవకాశం కల్పిస్తుంటారు. దానిపై ఇటీవలి కాలంలో.. ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. భక్తులను తప్పుదోవ పట్టించేలా.. వారిలో భయాలు పుట్టించేలా తప్పుడు ప్రచారాలు మిన్నంటాయి. టీటీడీ ఈ విషయంలో అప్రమత్తమై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వృద్ధుల దర్శనం గురించి జరుగుతున్న ప్రచారాల్ని నమ్మవద్దని ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి రోజూ వెయ్యిమంది వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడునెలల ముందుగా ఆన్ లైన్ కోటా విడుదలట చేస్తుందని, టికెట్ పొందిన వారికరి రూ.50 లడ్డూను ఉచితంగా ఇస్తుందని, తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని ప్రకటించారు.అలాగే.. వీరు సాగిస్తున్న తప్పుడు ప్రచారాలు ఎలా ఉంటున్నాయంటే..  అలిపిరి నుంచి రుయావైపు వెళ్లే మార్గంలో ఎవరో ఆకతాయిలు.. గాజుసీసా పెంకులు పడేస్తే.. అలిపిరి మెట్ల మార్గంలో మద్యం తాగిన మందుబాబులు ఖాళీసీసాలను పడేశారంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నిజానికి అలిపిరి ప్రాంతంలో.. అలిపిరినుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఎక్కడా అలాంటి దాఖలాలూ లేవు. అవకాశమూ లేదు. ఎక్కడో ఉన్న పెంకులను.. అలిపిరి మెట్లమార్గం అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం వారికే చెల్లింది.ఒకవైపు భూమన కరుణాకరరెడ్డి గోశాలలో ఆవులు చచ్చిపోయాయని, కొన్ని సంవత్సరాలుగా వృథాగా పడి ఉన్న విగ్రహం.. విష్ణుమూర్తిని పక్కన పడేశారని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. మరోవైపు వైసీపీ దళాలు.. సోషల్ మీడియాలో ఇలా ముసుగులో ఉంటూ.. సాగించే తప్పుడు ప్రచారాలు అదనం. ఇలాంటి దుర్మార్గపు పోకడలను  ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
The post దేవుడిపై బురదచల్లుడా.. ఇంతకంటె నీచముంటుందా? appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేతటీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన కీల‌క పోరులో భార‌త్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటింది. ఈ టోర్నీ లో మ‌రోసారి

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ ఖ‌ర్చు పెట్టారు ఈ మూవీ కోసం.

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో