hyderabadupdates.com Gallery నంద‌మూరి బాల‌య్య‌తో కొర‌టాల శివ మూవీ

నంద‌మూరి బాల‌య్య‌తో కొర‌టాల శివ మూవీ

నంద‌మూరి బాల‌య్య‌తో కొర‌టాల శివ మూవీ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందుతున్న ద‌ర్శ‌కుల‌లో కొర‌టాల శివ ఒక‌రు. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్, జాహ్న‌వి క‌పూర్ తో తీసిన మూవీ దుమ్ము రేపింది. బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌ముఖ న‌టుడు, స్టార్ డ‌మ్ క‌లిగిన హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ తో క‌లిసి ఓ చిత్రాన్ని తీయ‌బోతున్న‌ట్లు టాక్. ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం చేతులు కలపనున్న‌ట్లు స‌మాచారం.
అలాగే 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ, బాలకృష్ణ. గత ఏడాది డిసెంబర్‌లో ‘అఖండ 2’ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించక పోవడంతో నందమూరి బాలకృష్ణ అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన దర్శకుడు కొరటాల శివతో జత కట్టనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘దేవర’లో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించగా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. బాలయ్య ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన వెంటనే, ‘శ్రీమంతుడు’ దర్శకుడైన కొరటాల శివతో కలయిక కార్యరూపం దాల్చనుంది. వీరిద్దరి కలయికకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
The post నంద‌మూరి బాల‌య్య‌తో కొర‌టాల శివ మూవీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రిఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రి

హైద‌రాబాద్ : వాహ‌న దారుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్. లెర్నర్ లైసెన్స్‌కు ముందు ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్షను త‌ప్ప‌నిస‌రి చేసింది . దీంతో వాహ‌నదారుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్‌ను

న‌ల్ల మ‌ల్లారెడ్డి ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా చ‌ర్య‌లున‌ల్ల మ‌ల్లారెడ్డి ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తోంది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉండ‌గా స‌రిగ్గా ఏడాది క్రితం దివ్యా న‌గ‌ర్ లే ఔట్‌లో అడ్డుగోడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా మ‌ళ్లీ అక్క‌డే

గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బ‌లోపేతం చేస్తాంగ్రామీణాభివృద్ధి వ్యవస్థను బ‌లోపేతం చేస్తాం

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ (సీతక్క) స్ప‌ష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు