hyderabadupdates.com Gallery న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు post thumbnail image

న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. స‌త్యం బ‌తికే ఉంద‌ని తేలి పోయింది. ఒక‌టా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచ‌ల‌నం సృష్టించిన న‌టి ప్ర‌త్యూష కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఇదిలా ఉండ‌గా సినీ నటి ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొన్నిఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. 2002 ఫిబ్రవరి 23న తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి కొద్ది రోజులకు కోలుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించిందంటూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు . ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా.. హైకోర్టు దాన్ని రెండేళ్లకు కుదించింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సిద్ధార్డ్ రెడ్డి కూడా దానికి కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు పరిశీలించిన న్యాయస్థానం గతేడాది నవంబర్ లో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ సిద్ధార్డ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. త‌ను నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
The post న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌వితబీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు

తిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభంతిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో