hyderabadupdates.com Gallery నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం

నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం

నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పారే న‌దుల‌ను అనుసంధానం చేస్తామ‌ని, ప్ర‌తి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు. రూ.440 కోట్ల విలువైన డయాఫ్రం దెబ్బతిన్న‌ద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ దాని పునర్నిర్మాణం కోసం రూ.1000 కోట్లు ఖర్చు అవుతోందని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామ‌న్నారు. పోలవరం ఎడమ కాలువతో వంశధారను అనుసంధానం చేసి ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేస్తామ‌న్నారు . అటు నల్లమల సాగర్ తోనూ అనుసంధానించి రాయల సీమకూ నీరు తరలిస్తామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
గోదావరి, కృష్ణా నదుల ద్వారా 5 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు .
కేవలం 200 టీఎంసీల వరద నీటిని నల్లమలసాగర్ కు తరలించి కరవును తరిమికొట్టాలన్నదే మా ప్రయత్నం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసినా మనం అభ్యంతరం చెప్ప లేద‌న్నారు. మన తెలుగు సోదరులే అక్కడా ఉన్నార‌ని, మనవాళ్లే నీళ్లు వినియోగించుకుంటే అందరికీ సంతోషమేన‌ని అన్నారు. వారు నీళ్లు వినియోగించుకున్నా ఏపీకి అభ్యంతరం లేద‌న్నారు. ఏపీలో ఉన్న జలాశయాలు, గొలుసు కట్టు చెరువులు అన్నీ నింపి మన రైతులకు, ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామ‌న్నారు. కరవును తరిమి కొట్టేలా కార్యాచరణ చేపడుతున్నాం అని, దానికి సాగునీటి సంఘాల ప్రతినిధులంతా సహకారం అందించాలని కోరారు.
The post నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Special Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణSpecial Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ

    దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది. 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌

రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని, ప్ర‌జా పాల‌న‌కు మంగ‌ళం పాడారంటూ మండిప‌డ్డారు. సింగ‌రేణి స్కాంలో సీఎం కీల‌క పాత్ర ఉంద‌ని,