hyderabadupdates.com Gallery న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి post thumbnail image

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మున్సిప‌ల్ , మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజ‌యాన్ని చేకూర్చి పెట్టార‌ని అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలో ఆక‌స్మిక త‌నికీ చేశారు. క‌మిష‌న‌ర్ తో క‌లిసి ప‌ట్ట‌ణంలో ప‌రిశీలించారు. ప్రజల సహకారంతో నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుం చే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రకాశం బజార్, లతీఫ్ షాప్ గుట్ట తదితర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.
ప్రకాశం బజార్‌కు ప్రతిరోజూ సుమారు 10,000 మంది ప్రజలు వస్తుంటారని అన్నారు మంత్రి. పెరుగుతున్న జనాభా, వ్యాపారాలకు అనుగుణంగా ఇక్కడి రహదారులు లేక పోవడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న పూలు, పండ్లు, చిన్న వ్యాపారాలను పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలానికి తరలించాలని అధికారుల‌ను ఆదేశించారు మంత్రి. ఏ ఒక్క చిన్న వ్యాపారికి అన్యాయం జరగకుండా, వారి ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులతో స‌మీక్ష చేప‌ట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భూగర్భ విద్యుత్ వ్యవస్థ (Underground Cabling) ఏర్పాటు చేస్తామ‌న్నారు.
పటిష్టమైన సిసి రోడ్ల నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
The post న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీRahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీ

    ఓట్ల చోరీ అంశంపై బీజేపీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో పెద్ద మొత్తం(టోకుగా)లో ఓట్లను చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని, ఈ విధంగానే మోదీ

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే

Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యేSuresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే

    బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌ కుమార్‌ మంగళవారం ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారమెత్తారు. బెంగుళూరు నగరంలోని భాష్యం సర్కిల్‌ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్‌ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్‌ కాప్‌