hyderabadupdates.com movies నాయకుడు తప్పుకుంటే ‘రాజా సాబ్’కు పండగే

నాయకుడు తప్పుకుంటే ‘రాజా సాబ్’కు పండగే

రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా ప్రకటించబడిన జన నాయకుడు జనవరి 9 విడుదలను ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై వర్గాలు ఇప్పుడీ డేట్ కి రావడం అనుమానమేనని చెబుతున్నాయి. ఇటీవలే జరిగిన కరూర్ దుర్ఘటనలో తన పార్టీ మీటింగ్ వల్ల నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విజయ్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేసింది. ఈ సభకు బాధ్యులైన వారి మీద కేసులు నమోదయ్యాయి కానీ ఇంకా అందరూ దొరకలేదు. పైగా వాళ్ళు కీలక వ్యక్తులు కావడంతో పొలిటికల్ మూమెంట్స్ ని ప్లాన్ చేసుకోవడానికి విజయ్ కు సరైన సహాయం లేకుండా పోయిందని ఇన్ సైడ్ టాక్.

ఈ ఒత్తిడిలో ఇప్పుడు సినిమా రిలీజ్, ప్రమోషన్లంటూ హడావిడి చేస్తే మీడియాతో పాటు జనం వైపు నుంచి విమర్శలు ఎదురుకునే ప్రమాదం ఉండటంతో జన నాయకుడు వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సీరియస్ గానే చేస్తున్నారట. నిర్మాణ సంస్థ ప్రస్తుతానికి పాత తేదీకే కట్టుబడి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తోంది. నిజంగా జన నాయకుడు బరిలో నుంచి తప్పుకుంటే రాజా సాబ్ కు పండగే. ఎందుకంటే తమిళనాడు, కేరళలో విజయ్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా రాజా సాబ్ కు ఓపెనింగ్స్ పరంగా పెద్ద సమస్య అయ్యేది. కానీ ఇప్పుడు సోలో రిలీజ్ దక్కితే మతిపోయే బాక్సాఫీస్ నెంబర్లు కళ్లజూడవచ్చు.

ప్రస్తుతానికి ఇదేదీ కన్ఫర్మ్ కాదు కాబట్టి అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి. జన నాయకుడు తప్పుకుంటే రాజా సాబ్ తో పాటు శివకార్తికేయన్ పరాశక్తి కూడా విపరీతంగా లాభ పడుతుంది. పండగ సీజన్ కావడం వల్ల విజయ్ రేస్ లో లేకపోతే కొన్ని పదుల కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుంది. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి. ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చూడాలి మరి జన నాయకుడు మాట మీద ఉంటాడో లేక రూటు మారుస్తాడో.

Related Post

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేకరించిన సంతకాల పత్రాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించినట్లు

సుప్రీంకోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్ విజయ్సుప్రీంకోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ సినీనటుడు విజయ్… తమిళ వెట్రిగ కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా