hyderabadupdates.com Gallery నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్ యాక్షన్ డ్రామా స్టైల్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్ల పరంగా కూడా బలమైన స్టార్ట్ సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

రిలీజ్ డేలోనే ఈ సినిమా దాదాపు 18 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంది. అయితే రెండో రోజు మాత్రం ఊహించని విధంగా వసూళ్లు తగ్గిపోయాయి. సాధారణంగా నార్త్ లో వర్కింగ్ డే అయినప్పటికీ, సినిమాకి టాక్ బాగుంటే కలెక్షన్లు మెరుగ్గానే కొనసాగుతాయి. కానీ కాంతార ప్రీక్వెల్ కి మాత్రం మొదటి రోజు తో పోలిస్తే రెండో రోజు దాదాపు 5 కోట్ల వరకూ తగ్గిపోయాయి. దీంతో రెండో రోజు కలెక్షన్లు సుమారు 13.5 కోట్ల వద్ద ఆగిపోయాయి.

ఇక వీకెండ్ లోని శనివారం, ఆదివారం రోజుల్లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
The post నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిKurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

    కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద

మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తిమ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి

హైద‌రాబాద్ : ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి. ఆదివారం ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె