hyderabadupdates.com Gallery నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్ post thumbnail image

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే అఖండ -2 మూవీ అద్బుతంగా ఉందని, భారతీయ సంస్కృతిని ప‌రిర‌క్షించేలా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అధిపతి మోహ‌న్ భ‌గ‌వ‌త్. దీంతో పాటు కేంద్ర హొం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సైతం సూప‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉండ‌గా భారీ ఎత్తున డిమాండ్ ఏర్ప‌డింది అఖండ -2 చిత్రానికి. దీనిని చేజిక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటీటీ సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు అమరికాకు చెందిన ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కైవ‌సం చేసుకుంది. అయితే అఖండ -2 ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంద‌నే దానిపై ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ లేదు.
సినీ వ‌ర్గాల నుంచి అందిన విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారం మేర‌కు సంక్రాంతి పండుగ కంటే ముందే అంటే జ‌నవ‌రి 9వ తేదీన స్ట్రీమింగ్ కానుంద‌ని టాక్. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం సినిమా డిజిటల్ హక్కులను పొందినప్పటికీ ప్రీమియర్ తేదీకి సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌క పోవ‌డం ప‌ట్ల ఉత్కంఠ నెల‌కొంది నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల్లో. ఇదిలా ఉండ‌గా బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌రుస‌గా ఇది నాలుగో సినిమా కావ‌డం విశేషం. ఇక అఖండ -2 మూవీలో బాల‌కృష్ణ‌తో పాటు ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, హర్షాలీ మల్హోత్రా , శశ్వత ఛటర్జీ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ ప్రాజెక్ట్‌ను రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. రూ. 50 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు అవుతే రూ. 100 కోట్ల‌కు పైగా రావ‌డం విశేషం.
The post నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్

అమరావతి : గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామ‌ని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ

రుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టురుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. కోట్లాది మంది బాలిక‌లు, యువ‌తులు, మహిళ‌లు ప్ర‌తి నెలా మెన్స‌స్ తో తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతారు. ప్ర‌త్యేకించి బాలిక‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది. ప్ర‌త్యేకించి నెల నెలా

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీCM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల