hyderabadupdates.com movies పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది. రేపు థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ కావడం లేదు. థియేటర్ల కొరత, స్ట్రెయిట్ సినిమాల పోటీ, సెన్సార్ ఆలస్యం తదితర కారణాల వల్ల ఏపీ తెలంగాణ విడుదల వాయిదా వేసుకున్నారు.

సరే ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే కానీ డబ్బింగ్ వెర్షన్ లేట్ కావడం వల్ల మన ఆడియన్స్ కి పరాశక్తి తమిళ టాక్, రివ్యూలు ముందుగానే తెలుసుకునే అవకాశం దక్కుతుంది. హిట్టయితే సంతోషమే కానీ ఏమాత్రం అటుఇటు అయినా ఇక్కడ ఓపెనింగ్స్ ఆశించడం కష్టమవుతుంది.

దర్శకురాలు సుధా కొంగర కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వల్ల పొలిటికల్ గా ఇందులో కొన్ని కాంట్రవర్సిలు పెట్టారు. వాటిని కుదించడంతో పాటు పాతిక దాకా కట్స్ కి అంగీకారం తెలిపి టీమ్ ముందుకు వెళ్తోంది.

కీలకమైన పొంగల్ పండక్కు సరైన సినిమా లేదని అక్కడి మూవీ లవర్స్ బాధ పడుతున్న టైంలో పరాశక్తికి క్లియరెన్స్ రావడం జాక్ పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే కాంపిటీషన్ లేకపోవడం వల్ల అనుకున్న దానికన్నా రెట్టింపు నెంబర్లతో వసూళ్లు రాబోతున్నాయనేది వాస్తవం.

హీరోయిన్ శ్రీలీల మాత్రం తెగ ఫీలైపోతోంది. ఎందుకంటే రెగ్యులర్ హీరోయిన్ కాకుండా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇందులో చేసింది. కానీ తెలుగు ఫ్యాన్స్ ని చూసే అవకాశం లేకపోవడం వల్ల మన రెస్పాన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉండదు. హైదరాబాద్ లో కూడా తమిళ వెర్షన్  రిలీజ్ చేయడం లేదు.

కోలీవుడ్ లో యునానిమస్ టాక్ వస్తేనే పరాశక్తికి ఇక్కడ బజ్ సంపాదించుకోవచ్చు. రెండేళ్ల క్రితం శివ కార్తికేయన్ అయలన్ వాయిదా పడి చివరికి థియేటర్లకు రాకుండానే ఇటీవల ఓటిటి ప్రీమియర్ జరుపుకుంది. పరాశక్తికి అలాంటి పరిస్థితి రాకూడదని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. రేపీపాటికి ఫుల్ రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి.

Related Post

అర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగంఅర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగం

మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్ నైట్ స్క్రీనింగ్ ఊహలకు అందని పరిణామం. మన శంకరవరప్రసాద్ గారు డిమాండ్ ని తట్టుకోవడానికి బయ్యర్లకు ఇంతకన్నా మార్గం లేకపోయింది.

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను వేధించిన విష‌యం తెలిసిందే. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సుధాక‌ర్ ఎన్ 90 మాస్క్‌ను కోరిన ఘటన