hyderabadupdates.com Gallery ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ను క‌లుసుకున్నారు. అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛాంబ‌ర్ కు స్వ‌యంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్ద‌రూ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇరువురి మ‌ధ్య తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పూర్త‌యిన వెంట‌నే బీఏసీ, ఆ త‌ర్వాత ఎన్డీఏ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా బ‌డ్జెట్ సమావేశాల‌లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై చ‌ర్చించారు నారా లోకేష్. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో పాటు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉండ‌గా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీగా గ‌డిపారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిలిచి పోయిన నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల్ సీతారామ‌న్ , కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ , రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ , మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ , శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ల‌ను క‌లుసుకున్నారు. చంద్ర‌బాబు వెంట ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపీలు కూడా ఉన్నారు.
The post ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

OSRTC Bus: మన్యం జిల్లాలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధం !OSRTC Bus: మన్యం జిల్లాలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధం !

    పార్వతీపురం-మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుండి ఒడిశాలోని జైపూర్ వెళ్తున్న ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సులో… పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని మంటల చెలరేగాయి. అయితే బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో

అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణఅన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ

విశాఖ‌పట్నం జిల్లా : అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ను ఆవిష్క‌రించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లిలో అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం తీసుకుంది ఏపీ స‌ర్కార్. ఇందులో భాగంగా

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage : ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్‌ పేరుతో కిడ్నాప్‌ కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ