hyderabadupdates.com movies పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!

పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఒకే వేదిక‌పై ప‌లు మార్లు క‌లుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్నారు. వారి మ‌ధ్య‌లో ఇత‌ర నాయ‌కులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో శ్రీశైలం దేవ‌స్థానానికి విచ్చేసిన ప్ర‌ధాన మంత్రి-సీఎం-ఉప‌ముఖ్య‌మంత్రులు.. దాదాపు ఒక‌రి ప‌క్క‌న ఒక‌రు కూర్చుని చ‌ర్చించుకుంటున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దీనికి `త్రిమూర్తులు` అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. శ్రీశైలంలోని భ్ర‌మ‌రాంబ అమ్మ‌వారి దేవ‌స్థానంలో అమ్మ‌వారి మండ‌పం ఉంది. దీని అరుగుపై ఎలాంటి ఆచ్ఛాద‌న లేకుండా అలానే కూర్చున్న ముగ్గ‌రు అధినేత‌లు.. ఒక‌రి కొక‌రు దాదాపు ఎదురుగా కూర్చొన్న‌ట్టుగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారో తెలియ‌దు కానీ.. ఆల‌య విశేషాల గురించి.. సీఎం చంద్ర‌బాబు వివ‌రిస్తున్న‌ట్టుగా.. ప్ర‌ధాని ఆస‌క్తిగా వింటున్న‌ట్టుగా ఈ ఫొటోలో క‌నిపిస్తోంది.

ఇక‌, వారికి ప‌క్క‌నే.. వారి వైపు తిరిగి అరుగుపై కూర్చున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వారి సంభాష‌ణ‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. ఇలాంటి ఫొటో ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. అనేక స‌భ‌ల్లో ప‌క్క ప‌క్క‌న కూర్చున్నా.. ఇలా.. ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకునే సందర్భం.. అందునా.. దేవ స్థానంలోని అరుగుపై.. పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చుని మాట్లాడుకున్న‌ట్టుగా ఉండ‌డంతో ఎక్కువ మంది షేర్‌లు, లైకులు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తం క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఈ ఫొటో హైలెట్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

Related Post

90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్

టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించిన చర్చే కనిపిస్తోంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవాలంటే నిర్మాతలు సినిమా విడుదల తేదీని పక్కాగా నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా 90 రోజుల ముందే జిఓలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే తీసుకొచ్చింది. ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నాయకుడు కాంబినేషన్ రిపీట్ చేస్తే ఇలాంటి దారుణమైన సినిమా ఇచ్చారేమిటని మూవీ లవర్స్