hyderabadupdates.com movies పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆర్చన అదే గ్రామానికి చెందిన అనిల్ అనే పెళ్లయిన వ్యక్తితో ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పలుమార్లు ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె ఆ సంబంధాన్ని విడిచిపెట్టకపోవడంతో, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే భావనతో తల్లిదండ్రులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నవంబర్ 15 రాత్రి ఆర్చన నిద్రపోయిన తర్వాత ఆమెకు బలవంతంగా విషం తాగించారని, ఇంకా ప్రాణాలతో ఉన్న సమయంలో తండ్రి గొంతు నులిమి చంపినట్లు విచారణలో బయటపడింది. పోలీసుల విచారణలో తండ్రి రెడ్డి రాజు నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఈ ఘటన నేపథ్యంలో సైదాపూర్ పోలీసులు తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్యలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారిని కస్టడీకి పంపింది.

ఇదిలా ఉండగా, ఆర్చన అక్క శ్రావణి మరో ఫిర్యాదు చేస్తూ, అనిల్‌తో ఉన్న సంబంధమే తన చెల్లి మృతికి కారణమని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా అనిల్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో కుటుంబ గౌరవం పేరుతో జరిగే హింస ఎంత దారుణమైనదో మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Post

Madhura Sreedhar’s Santhana Prapthirasthu Promises a Heartfelt Family EntertainerMadhura Sreedhar’s Santhana Prapthirasthu Promises a Heartfelt Family Entertainer

“Santhana Prapthirasthu” is all set for a grand release on November 14, offering a refreshing mix of love, fun, and emotion. Starring Vikranth and Chandini Chowdary, the film is directed

వరప్రసాద్ ట్రైలర్ మీద ‘మెగా’ ఒత్తిడివరప్రసాద్ ట్రైలర్ మీద ‘మెగా’ ఒత్తిడి

ఎల్లుండి తిరుపతిలో మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అనేలా ఫైనల్ కట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు మూడు పాటలు మినహాయించి

5 రూపాయలకే పరోటా ఇస్తున్న అభిమాని, రజినీ ఏం చేశాడు?5 రూపాయలకే పరోటా ఇస్తున్న అభిమాని, రజినీ ఏం చేశాడు?

సినీ హీరోలను అభిమానించే విషయంలో ఇటు తెలుగు వాళ్లు.. అటు తమిళులు ఎవరికి వారే సాటి అన్నట్లుంటారు. సినిమా హీరోలను వాళ్లు దేవుళ్లలా చూస్తారు. ఇప్పుడంటే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేయడం.. అవతలి హీరోల మీద విషం చిమ్మడం