hyderabadupdates.com Gallery పొరుగు దేశాలపై ఇరాన్ దాడుల ప‌ట్ల‌ ఆగ్ర‌హం

పొరుగు దేశాలపై ఇరాన్ దాడుల ప‌ట్ల‌ ఆగ్ర‌హం

పొరుగు దేశాలపై ఇరాన్ దాడుల ప‌ట్ల‌ ఆగ్ర‌హం post thumbnail image

యూర‌ప్ : పొరుగు దేశాల‌పై ఇరాన్ దాడుల‌కు దిగ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది జి7. తక్షణమే నిలిపి వేయాలని కోరింది . ఇరాన్ చర్యలు ప్రాంతీయ , ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని హెచ్చ‌రించింది. ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌ను, దాడుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపి వేయాల‌ని ఆదేశించింది. ఇది పూ్ర్తిగా సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగించడం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ యుద్ధం పర్యవసానాలను చర్చించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ G7 నాయకుల వీడియో కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహించారు.
జి7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ , యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రులు, యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధితో కలిసి పొరుగు దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇరాన్, దాని అనుచరులు చేస్తున్న అసమంజ‌స‌మైన దాడులుగా పేర్కొంది.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ , దాని అనుచరులు చేస్తున్న అన్యాయమైన దాడుల నేపథ్యంలో, ఈ ప్రాంతంలోని త‌మ‌ భాగస్వాములకు మద్దతు తెలియ జేస్తున్నామని పేర్కొన్నారు . బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ , ఇరాక్‌లలో పౌరులు, ఇంధన సౌకర్యాలతో సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను జి7 మంత్రులు ఖండించారు.
The post పొరుగు దేశాలపై ఇరాన్ దాడుల ప‌ట్ల‌ ఆగ్ర‌హం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్

  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైనదని.. పర్యావరణ సంపదతో పాటు, సాంస్కృతిక

మార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుమార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి/ఒంటిమిట్ట : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి . ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 24న

హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్

అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్ లో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంత‌కు ముందు స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రిగిన ప్ర‌త్యేక