hyderabadupdates.com Gallery పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్

పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్

పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్ post thumbnail image

ముంబై : డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2026లో మ‌రోసారి ఛాంపియ‌న్ గా నిలిచేందుకు రెడీ అయ్యింది. ర‌జిత్ పాటిదార్ సార‌థ్యంలోని ఆర్సీబీ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. తాజాగా ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును త‌మ స్వంత గ‌డ్డ‌పై మ‌ట్టి క‌రిపించింది. 18 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. అంత‌కు ముందు బాలీవుడ్ కు చెందిన దిగ్గ‌జ గాయ‌ని ఆశా బోంస్లే క‌న్ను మూశారు. ఇవాళ ఆమెకు అంత్య‌క్రియ‌లు అధికారికంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించి మ్యాచ్ లో ఆడారు. ఇక ఆట విష‌యానికి వ‌స్తే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు.
ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ ముంబై బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసింది. గ‌త కొన్ని మ్యాచ్ ల‌లో అంత‌గా రాణించ‌ని ఫిల్ సాల్ట్ ఈసారి రెచ్చి పోయాడు. కేవ‌లం 36 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 78 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. మ‌రో వైపు విరాట్ కోహ్లీ 38 బంతులు ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 240 ర‌న్స్ చేసింది. అనంత‌రం భార టార్గెట్ ను ఛేదించేందుకు మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ 5 వికెట్లు కోల్పోయి 222 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది.
The post పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువుఅద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు

హైద‌రాబాద్ : చారిత్ర‌క బ‌మృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ద‌మైంది. ఆదివారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. న‌గ‌ర ప్రజ‌ల‌కు ఇక నుంచి రానుంద‌ని ప్ర‌క‌టించారు. చెరువు సుంద‌రంగా త‌యార‌వ్వ‌డం ప‌ట్ల హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆనందం

పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరటపశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట

అమరావతి : రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ