hyderabadupdates.com Gallery ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన స్థ‌లాల‌లో ఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డ‌డ‌మే కాకుండా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డంపై ఫోక‌స్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌లు సృష్టించారు క‌బ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్‌తో భ‌వ‌న అనుమ‌తులు తీసుకున్నారు. 5 అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మాణం జ‌రిగాక మ‌ణికొండ మున్సిప‌ల్ అధికారులు ఆ స్థ‌లాలు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన‌వ‌ని చెబుతూ త‌మ ప‌రిధిలో ఉన్న భ‌వ‌న అనుమ‌తులు ర‌ద్దుచేశారు. నేరుగా హెచ్ ఎం డీఏ నుంచి అనుమ‌తులు తీసుకున్నందున మ‌రో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు ర‌ద్దు చేయాలంటూ హెచ్ ఎం డీఏకు మ‌ణికొండ మున్సిప‌ల్ అధికారులు లేఖ‌ రాశారు. ఇవ‌న్నీ అయ్యేలోపు గృహ ప్ర‌వేశం చేసేయాల‌న్నంత వేగంగా నిర్మాణాలు జ‌రిగి పోయాయి. ఇంత‌లో అక్క‌డి నివాసితులు హైడ్రాను ఆశ్ర‌యించారు. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల్లో రెండు, 5 అంత‌స్తుల భ‌వ‌నాల నిర్మాణాలు జ‌రిగిపోతున్నాయ‌ని… ఆ అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసినా నిర్మాణాలు ఆగ‌డంలేద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఇక హైడ్రాకు ఫిర్యాదు వ‌చ్చింద‌ని తెలుసుకున్న నిర్మాణ‌దారులు… కోర్టును ఆశ్ర‌యించారు. ఇదేదో విష‌యం తెలుసు కోవాల‌ని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను వెంట‌నే ఆపాల‌ని హైకోర్టు నేరుగా చెప్ప‌లేద‌న్న నెపంతో నిర్మాణ ప‌నుల‌ను మ‌రింత వేగం చేశారు. నిర్మాణాలు చేప‌ట్టిన వారితో పాటు.. అక్క‌డి నివాసితుల‌ను, ఫిర్యాదు దారుల‌ను హైడ్రా పిలిపించి విచారించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పూర్తి వివ‌రాలు తెలుసుకున్నారు. ప‌నులు జ‌ర‌కుండా అ రెండు భ‌వ‌నాల‌ను సీజ్‌చేయాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు హైడ్రా ఆ రెండు భ‌వ‌నాల‌ను సీజ్ చేసి ఫెన్సింగ్ వేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం నెక్నాంపూర్ విలేజ్‌లోని మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర కాల‌నీ హెచ్ ఎండీఏ లే ఔట్ అది. ఇందులో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించి 300ల గ‌జాల చొప్పున 4 ప్లాట్లు కేటాయించారు. ఆ నాలుగుతో పాటు.. ప‌క్క‌నే ఉన్న మ‌రి కొంత క‌లిపి దాదాపు 1500ల గ‌జాల వ‌ర‌కూ స్థ‌లాన్నిచూపించి.. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌తో మ‌ణికొండ మున్సిపాలిటీలో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు పొందారు. ఇక్క‌డ జీ ప్ల‌స్ 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించారు. ఇదే లే ఔట్‌లో సెప్టిక్ ట్యాంకు/ పార్కు స్థ‌లంగా కేటాయించిన దాదాపు 2 వేల గ‌జాల స్థ‌లంలో మ‌రో ప్ర‌బుద్ధుడు ఎల్ ఆర్ ఎస్‌తో పాటు.. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను నేరుగా హెచ్ ఎండీఏ నుంచే తీసుకున్నారు. ఇక జెట్ స్పీడులో నిర్మాణాలు చేస్తున్నారు.
The post ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకాBomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

    2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో

CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్

CBI : పంజాబ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌చరణ్ సింగ్ బుల్లర్ అవినీతి కేసులో గురువారం అరెస్ట్ అయ్యారు. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు ఆయన్ని మొహాలి ఆఫీస్‌లో అదుపులోకి తీసుకున్నారు.

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లులోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

అమ‌రావ‌తి : నారా లోకేష్ యువ గ‌ళం చేప‌ట్టి స‌రిగ్గా మూడేళ్లు పూర్త‌య్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. జ‌గ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో