hyderabadupdates.com Gallery ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్

ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్

ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్ post thumbnail image

హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ భారీ బ‌డ్జెట్ తో ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ది కుమారి కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైంది. ఆశించిన మేర వ‌ర్క‌వుట్ కాలేదు. అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఆపై ద‌ర్శ‌కుడు మారుతిపై తీవ్ర విమ‌ర్శ‌లు నెల‌కొన్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ కొన‌సాగుతూనే ఉంది. ఇదిలా ఉండ‌గా ఇదే ఫెస్టివ‌ల్ సంద‌ర్బంగా ప‌లు సినిమాలు ముందుకు వ‌చ్చాయి. న‌వీన్ పోలిశెట్టి, చాందిని చౌద‌రి ముఖ్య పాత్ర‌లు పోషించిన అన‌గ‌న‌గా ఒక రోజు, ప్ర‌భాస్ న‌టించిన రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి, వెంక‌టేష్‌, న‌య‌నతార , టీటీకే గ‌ణేష్ కీ రోల్స్ పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి, ఆషికా రంగ‌నాథ్ న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఙ‌ప్తి రిలీజ్ అయ్యాయి.
ప‌లు సినిమాలు విడుద‌లైనా చివ‌ర‌కు టాప్ లో కొన‌సాగుతోంది మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు, అన‌గ‌న‌గా ఒక రోజు మాత్ర‌మే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ, వినోదం ప్ర‌ధానంగా సాగిన సినిమాల‌కే జ‌నం జై కొట్టారు. ఈ త‌రుణంలో ప్ర‌భాస్ రాజ్ న‌టించిన మూవీ ఆశించిన మేర ఆడ‌క పోవ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు తీవ్రంగా న‌ష్ట పోయారు. పెట్టిన డ‌బ్బులు రాక పోవ‌డంతో వారంతా తీవ్ర నిరాశ‌కు లోనయ్యారు. ఈ మేర‌కు దాదాపు 50 శాతానికి పైగా తాము న‌ష్ట పోయామ‌ని, వెంట‌నే త‌మ డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని కోరుతున్నారు.
The post ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది.

మార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీమార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీ

త‌మిళ‌నాడు : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ త‌మిళ‌నాడులో ప‌ర్యటించ‌నున్నారు. మార్చి 1వ తేదీన అధికారికంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన రాత్రికి చెన్నైకి చేరుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సిస్కో స‌హ‌కారంతెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సిస్కో స‌హ‌కారం

దావోస్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్కిల్ యూనివ‌ర్శిటీకి ప్ర‌ముఖ సంస్థ సిస్కో స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో సంస్థ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్బంగా సిస్కోకు ధ‌న్య‌వాదాలు