hyderabadupdates.com movies ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు ఈయన వంతు

ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు ఈయన వంతు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, రెండేళ్ల నుంచి ఈ కేసును కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని, ఎటూ తేల్చడం లేదని కేటీఆర్, హరీశ్ రావు విమర్శిస్తున్నారు.

సింగరేణి బొగ్గు టెండర్లలో అవకతవకలను కప్పిబుచ్చేందుకే ఈ సిట్ విచారణ పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బీఆర్ఎస్ నేతకు సిట్ అధికారులు నోటీసులిచ్చారు.

బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కేసీఆర్ బంధువు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సంతోష్ రావుకు సిట్ అధికారులు సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.

కాగా, బీఆర్ఎస్ హయాంలో డీఐజీ హోదాలో ఉన్న టీ.ప్రభాకర రావును 2016లో ఎస్ఐబీ చీఫ్ గా కావాలనే నియమించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.

రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, రేవంత్ రెడ్డి చూపిన బాటలోనే తాము కూడా పయనిస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నడుచుకునే అధికారులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

Related Post

అది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీఅది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ

అక్షరాలా వంద కోట్లు.. అంటే వెయ్యి మిలియన్లు.. ఈ మొత్తాన్ని ఒకరికి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా