hyderabadupdates.com Gallery బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న

బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న

బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న post thumbnail image

పాకిస్తాన్ : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తున్నాయి. ఈనెల 7 నుంచి వార్మ‌ప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ త‌రుణంలో తాము టీమిండియాతో జ‌రిగే మ్యాచ్ ల‌ను ఆడబోమంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాము ఇండియాతో జ‌రిగే మ్యాచ్ ను ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించారు. దీనిపై స్పందించారు పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌నాజ్ ష‌రీఫ్‌. భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశంలో తమ మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించినందుకు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోయే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం సూచించింద‌ని స్ప‌ష్టం చేశారు.
తాము తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి. ఇదే స‌మ‌యంలో ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ పై తాము చాలా స్ఫ‌ష్ట‌మైన వైఖ‌రితో ఉన్నామ‌న్నారు. క్రీడా మైదానంలో రాజ‌కీయాలు ఉండ కూడ‌ద‌ని, కానీ తాము భార‌త్ తో ఆడ బోవ‌డం లేదంటూ పేర్కొన్నారు. ఈ విష‌యం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ మోహిసిన్ న‌ఖ్వీ కి కూడా స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. తాము చాలా సునిశితంగా ఆలోచించి ఈ వైఖరి తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బంగ్లాదేశ్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు షెహ‌బాజ్ ష‌రీప్‌.
The post బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !

    కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్‌ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టంశ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సికింద్రాబాద్ పై. ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ చ‌రిత్ర‌ను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రో వైపు ఈ న‌గ‌రానికి చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారంతా ప్ర‌భుత్వానికి