hyderabadupdates.com Gallery బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

బాయిల్డ్ రైస్ ను  కేంద్రం సేక‌రించాలి : సీఎం post thumbnail image

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న‌తో పాటు మంత్రులు, ఉన్న‌తాధికారులు కూడాఉన్నారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషితో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రంలో యాసంగి పంట‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఇటీవ‌ల కేంద్ర‌ ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విష‌యాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి త‌మ‌ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి జోషి సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపారని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. 2014-15 వ‌ర్షాకాలం పంట అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోర‌వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు . పిల్లల్లో ర‌క్తహీన‌త‌, పోష‌క లోపాల‌ నివార‌ణ‌ కోసం పోష‌కాహార బియ్యాన్ని (FRK) పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలు, ఐసీడీఎస్‌ల ప‌రిధిలో పంపిణీ చేసే వార‌ని వెల్ల‌డించారు. అయితే ఇటీవ‌ల దానిని నిలిపి వేసినందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. వెంట‌నే పునః ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని కోరామ‌న్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.
The post బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపుTTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు

నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ISRO: సీఎమ్‌ఎస్‌-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధంISRO: సీఎమ్‌ఎస్‌-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ISRO : భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4,410కిలోల అత్యంత బరువైన సీఎమ్‌ఎస్‌-3 (సమాచార) ఉపగ్రహాన్ని ఆదివారం కక్ష్యలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో ‘బాహుబలి’గా పిలిచే