hyderabadupdates.com Gallery బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : టాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టులు విస్తృతంగా వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఎవ‌రికి వారు వివిధ రంగాల‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీస్తున్న వార‌ణాసిలో న‌టిస్తున్నాడు. త‌న‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ , ప్రియాంక చోప్రా, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే మ‌హేష్ బాబు త‌న స్వంత వ్యాపారంలో భాగంగా ఏఎంబీ పేరుతో ఐమాక్స్ థియేట‌ర్ల‌ను ప్లాన్ చేశాడు. హైద‌రాబాద్ లో ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. భారీ లాభాల‌ను తెచ్చి పెడ‌తోంది. ఈ త‌రుణంలో త‌న వ్యాపారాన్ని ఇత‌ర మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల‌కు కూడా విస్త‌రింప చేశాడు.
ఇందులో భాగంగా క‌ర్ణాట‌క రాజధాని బెంగ‌ళూరులో ఏఎంబీ థియేట‌ర్ ను ఓపెన్ చేశాడు. ఇది హాట్ టాపిక్ గా మారింది సినీ వ‌ర్గాల‌లో. మహేష్ బాబు ప్రస్తుతం తన అద్భుతమైన చిత్రం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రో వైపు వ్యాపారంపై ఫోక‌స్ పెట్టాడు. బెంగళూరులో తన ప్రతిష్టాత్మక థియేటర్ ని ప్రారంభించడానికి సమయం తీసుకున్నారు. ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవానికి వ్యక్తిగతంగా హాజరవుతున్న‌ట్లు సినీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. అయితే అధికారికంగా గ‌త జ‌న‌వ‌రి నెల 16న లాంచ్ అయ్యింది. మ‌హేష్ బాబు కు చెందిన థియేట‌ర్ బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ ప‌ట్ట‌ణం గాంధీ న‌గ‌ర్ లో ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది అత్యాధునిక స్క్రీన్లు ఉన్నాయి. దాదాపు 600 మంది కూర్చునేలా దీనిని తీర్చిదిద్దారు. 2019 నుంచి ఆసియా సినిమా స్ తో క‌లిసి త‌న వ్యాపారానికి శ్రీ‌కారం చుట్టాడు ప్రిన్స్.
The post బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రేసులో జ‌యేష్ రంజ‌న్తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రేసులో జ‌యేష్ రంజ‌న్

హైద‌రాబాద్ : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ ఐఏఎస్ జ‌యేష్ రంజ‌న్ ప్ర‌స్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా జ‌యేష్ రంజ‌న్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం తెలంగాణ

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేతUttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand : శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యంఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా