hyderabadupdates.com movies బేబీ జంటను కలుపుతున్న వెరైటీ ‘ఎపిక్’

బేబీ జంటను కలుపుతున్న వెరైటీ ‘ఎపిక్’

బేబీ క్లైమాక్స్ లో కలుసుకోలేక ప్రేమ విఫలమైన జంటగా మిగిలిపోయిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి ఆ తప్పు చేయడం లేదు. హ్యాపీగా అమెరికాలో కలుసుకుని తమ కొత్త లవ్ స్టోరీని ప్రేమికులకు చూపించబోతున్నారు. 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. 90స్ మిడిల్ క్లాస్ లో శివాజీ కొడుకుగా నటించిన బుడ్డోడు పెద్దయ్యాక యుఎస్ లో చదువుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ మీద వెరైటీగా రాసుకున్నారు. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ అనే వెరైటీ టైటిల్ లాక్ చేసి టీజర్ వదిలారు.

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ అయిపోయాక కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో స్పష్టమైన అవగాహన ఉన్న అమ్మాయి, వాటికి పూర్తి విరుద్ధంగా యుస్ వీధుల్లో చొక్కా లేకుండా గద్దర్ పాటలు పాడే అబ్బాయికి మధ్య ప్రేమ కుదరడమే ఇందులో క్రియేటివిటీ. మొత్తం ఫారిన్ లొకేషన్ లోనే షూట్ చేసిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హెయిర్ స్టైల్ మార్చడంతో పాటు ఆనంద్ దేవరకొండని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా విదేశాల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా ఉన్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అంచనాలైతే రేపింది.

ఇక విడుదల విషయానికి వస్తే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో ఉండే అవకాశముంది. షూటింగ్ దాదాపు పూర్తయిపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజానికీ ప్రాజెక్ట్ ఆదిత్య హాసన్ మొదట నితిన్ తో ప్లాన్ చేసుకున్నట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఈ కాంబో డ్రాప్ అయ్యింది. ఆ లక్కు కాస్తా ఆనంద్ దేవరకొండను వరించింది. బేబీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న బేబీ హీరోకి ఇది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. అటు వైష్ణవి చైతన్య కూడా వరస ఫ్లాపుల తర్వాత సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. బేబీ జంటను ఎపిక్ ఏం చేస్తుందో చూడాలి.

Related Post

కుల వివ‌క్ష‌కు ఏపీ ఐపీఎస్ `బ‌లి`.. దేశాన్ని కుదిపేస్తున్న `పూర‌ణ్‌` ఇన్సిడెంట్‌!కుల వివ‌క్ష‌కు ఏపీ ఐపీఎస్ `బ‌లి`.. దేశాన్ని కుదిపేస్తున్న `పూర‌ణ్‌` ఇన్సిడెంట్‌!

ఆయ‌న ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్య‌క్తి. తాజాగా ఈ నెల 7న ఆయ‌న త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కార‌ణం.. ప‌ని వ‌త్తిడి, మానసిక స్థితి స‌రిగా లేద‌ని తొలుత రోజు రోజంతా ప్ర‌చారంలోకి

అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి భారీ విరాళం ల‌భించింది. 100 కోట్ల రూపాయ‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ‌ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధుల‌తో ప్ర‌పంచ స్థాయి గ్రంథాల‌యాన్ని నిర్మించాల‌ని మీన‌న్ సూచించారు. ప్ర‌స్తుతం

జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విజ‌యాన్ని తాను ముందుగానే ఊహించాన‌ని చెప్పారు. “నేను ముందేచెప్పా.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్ప‌టికీ గెల‌వ‌దు. ఏం చేశార‌ని