hyderabadupdates.com Gallery బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ post thumbnail image

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమాను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అయితే ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుంద‌నే దానిపై అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. తెర‌పై స‌త్తా చాటిన ఈ మూవీ బిగ్ షాక్ ఇచ్చింది. సినీ వ‌ర్గాలు సైతం విస్తు పోయేలా కాసుల వ‌ర్షం కురిపించింది. తెర‌పై అద్భుత స‌క్సెస్ ను మూట‌గ‌ట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిట‌ల్ రంగ ప్ర‌వేశానికి రెడీ అవుతోంది. అద్భుత‌మైన చిత్రీక‌ర‌ణ‌, ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌లు, అంత‌కు మించి ర‌ణ్ వీర్ సింగ్ , సారా జాన్స‌న్ న‌టన అభిమానుల‌ను విస్మ‌య ప‌రిచింది.
ఇదిలా ఉండ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున దురంధ‌ర్ మూవీ స్ట్రీమింగ్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని టాక్. దీనిపై బ‌ల‌మైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయి, అయితే ఇది కూడా అధికారికంగా ధృవీకరించ లేదు సంస్థ‌. ఇక దురంధ‌ర్ మూవీ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు అక్ష‌య్ ఖ‌న్నా. త‌ను ఈ సినిమాకు అస్సెట్ అయ్యాడ‌న‌డంలో సందేహం లేదు.
The post బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌

    ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం కారాకట్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వీ… ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన

మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలిమూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

శ్రీ‌కాకుళం జిల్లా : శ్రీ‌కాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు పురోగ‌తి ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అచ్చెన్నాయుడు. సోమ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మూలాపేట పోర్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంతరం పోర్టు

సంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనాసంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనా

హైద‌రాబాద్ : కేర‌ళ క్రికెట్ స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంసన్ కు అస‌లు ఏమైంద‌ని ఆవేద‌న చెందుతున్నారు ల‌క్ష‌లాది త‌న అభిమానులు. ఇండియ‌న్ క్రికెట్ లో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ల‌లో త‌ను కూడా ఒక‌డు. ఒ వైపు అభిషేక్ శ‌ర్మ‌,