hyderabadupdates.com Gallery భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు

భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు

భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు post thumbnail image

తిరుమ‌ల : ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేర‌కు స‌ద‌రు నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్ల‌డించింది టీటీడీ. ఇందులో భాగంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్తులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.
టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల స‌మ‌న్వ‌యంతో సోషియ‌ల్ మీడియాలో శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం ఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్న‌కేశ‌వులు అనే వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు త‌ర‌లించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది టీటీడీ. ఇటీవ‌ల సోషియ‌ల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది.
ఎవ‌రైనా తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు తీసి ఇస్తామ‌ని చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని భ‌క్తుల‌ను కోర‌డ‌మైన‌ది. అలాంటి వ్య‌క్తుల స‌మాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెంః9866898630కు ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌లు సూచ‌న‌లు చేసింది శ్రీ‌వారి భ‌క్తుల‌కు. మోసం చేసే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. టీటీడీ ముంద‌స్తుగా అధికారికంగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి , సేవ‌ల‌కు గాను ఒక నెల ముందుగానే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను మాత్ర‌మే వినియోగించాల‌ని కోరింది.
The post భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణంKinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

    భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచంతో

Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టుNalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు

Nalgonda Police : అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడిన నిందితుడిని నల్గొండ (Nalgonda Police) జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు,

మంచు విష్ణు స‌వాల్ కు సై అన్న‌ అనిరుధ్ రెడ్డిమంచు విష్ణు స‌వాల్ కు సై అన్న‌ అనిరుధ్ రెడ్డి

పాల‌మూరు జిల్లా : జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సినీ రంగంతో పాటు అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల‌కు కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చారు. తాజాగా సినీ రంగంలోనే అత్య‌ధికంగా డ్ర‌గ్స్ తీసుకునే వారు ఉన్నార‌ని,