hyderabadupdates.com movies మధిరలో టీడీపీ అభ్యర్థి విజ‌యం!

మధిరలో టీడీపీ అభ్యర్థి విజ‌యం!

తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్థులు టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. ముఖ్యంగా ఏపీ స‌రిహ‌ద్దును ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని మ‌ధిర మునిసిపాలిటీలో ముగ్గురు మ‌హిళా అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపైనే పోటీచేశారు. వీరిలో మ‌ధిర 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘనవిజయం ద‌క్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి రిటర్నింగ్ అధికారి రేవతి గెలుపును అధికారికంగా ప్రకటించడంతో ఆమె అనుచరులు, మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి.

ఎలా సాధ్య‌మైంది?

ఖ‌మ్మం జిల్లాలో టీడీపీ అభిమానులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. 2014లోనూ ప‌లువురు అభ్య‌ర్థులు విజయం ద‌క్కించుకున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇలా.. త‌న పట్టును కొన‌సాగిస్తున్న సైకిల్ పార్టీ ఈ ద‌ఫా ప్ర‌త్య‌క్షంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. కొంద‌రు స్వ‌యంగా టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. మునిసిపల్ ఎన్నిక‌ల్లో ముగ్గురు మ‌హిళ‌లు టీడీపీ గుర్తుపైనే పోటీచేశారు.

వీరిలో రేవ‌తి.. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తుది ద‌శ ఫ‌లితాల్లో టీడీపీ అభ్య‌ర్థి బోడేపూడి రేవతి 334 ఓట్లు ద‌క్కించుకుని విజ‌యం సాధించారు. ఆమెపై పోటీ చేసిన అభ్యర్థి పెదపూడి సుధాకర్ 168 ఓట్లు మాత్ర‌మే ద‌క్కించుకున్నారు. దీంతో 166 ఓట్ల తేడాతో రేవ‌తి విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. ఇక‌, రేవ‌తి విజ‌యం వెనుక స్థానిక టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌లంగా ప్ర‌చారం చేయ‌డంతోపాటు.. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబుల సెంటిమెంటు కూడా క‌లిసి వ‌చ్చింది.

Related Post

సాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకుసాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ కావాలనే డిమాండ్ పెరిగిపోయింది. అనగనగా ఒక రోజు ప్రమోషన్ల కోసం నవీన్ పోలిశెట్టి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ఆడియన్స్ కొందరు ఈ కోరికను థియేటర్లో నేరుగా వినిపించారు. ఆ

కింగ్ తాలూకాలో అభిమాని ఎమోషన్స్కింగ్ తాలూకాలో అభిమాని ఎమోషన్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఆంధ్రకింగ్ తాలూకా నవంబర్ 28 విడుదల కానుంది. ఇంకో యాభై రోజుల కంటే తక్కువ సమయమే ఉండటంతో టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. ఇప్పటికే

ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌

బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను