hyderabadupdates.com Gallery మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌ post thumbnail image

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వ‌చ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసి వేయనున్నట్లు వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా ఆరోజు మ‌ధ్యాహ్నం 3.20 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందని తెలిపారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు ఈవో..
రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్య హ‌వచనం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుందని చెప్పారు. ఇదిలా ఉండ‌గా చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించు కోవాల్సిందిగా కోరారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి నూత‌న టెక్నాల‌జీ సాయంతో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు.
The post మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

President Droupadi Murmu: అంగోలాతో దీర్ఘకాల ఒప్పందాలకు కంపెనీలు సిద్ధం – రాష్ట్రపతి ముర్ముPresident Droupadi Murmu: అంగోలాతో దీర్ఘకాల ఒప్పందాలకు కంపెనీలు సిద్ధం – రాష్ట్రపతి ముర్ము

      ఆఫ్రికా దేశమైన అంగోలా నుంచి ఇంధన కొనుగోళ్లకు దీర్ఘకాల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్‌లోని చమురు-సహజవాయు సంస్థలు ఆసక్తితో ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెల్లడించారు. చమురుశుద్ధి, అరుదైన ఖనిజాల వెలికితీతలో పెట్టుబడులు పెట్టేందుకు అవి ఆసక్తితో

Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ… అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్