hyderabadupdates.com movies మిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందా

మిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందా

అక్కినేని నాగచైతన్య భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ స్వతహాగా నటి అయినప్పటికీ తెరమీద రెగ్యులర్ గా కనిపించడం ఉండదు. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి రెండు మూడు మూవీస్ తప్ప కంటిన్యూగా సినిమాలు చేయాలనే తాపత్రయం చూపించలేదు. ఎప్పుడైతే చైతు లైఫ్ పార్ట్ నర్ గా మారిపోయిందో అప్పటి నుంచి నాగ్ ఫ్యాన్స్ కు తనతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది.

పెళ్ళయాక తను నటించిన మొదటి మూవీ చీకటిలో తాజాగా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని చైతుతో పాటు పలువురు ఇండస్ట్రీ సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రీమియర్ వేశారు.

చీకటిలో రూపంలో శోభితకు కంబ్యాక్ దొరికిందా అంటే ముందు దాంట్లో ఏముందో చూడాలి. కథ పరంగా మరీ డిఫరెంట్ గా అనిపించదు. సంధ్య అనే టీవీ జర్నలిస్ట్ తన ఉద్యోగంలో రాజీ పడలేక స్వంతంగా పాడ్ క్యాస్ట్ పెట్టుకుంటుంది. స్నేహితురాలు బాబీతో పాటు ఆమె ప్రియుడు దారుణంగా హత్యలకు గురయ్యాక దీని వెనుక ఉన్న నిజాలు తేల్చేందుకు రంగంలోకి దిగుతుంది.

అయితే ఫోన్ చేసి మరీ హత్యలు చేసే ఆ సైకో కిల్లర్ ఎవరో అర్థం కాక డిపార్ట్ మెంట్ కష్టపడుతున్న టైంలో సంధ్య వాళ్లకు తోడుగా నిలబడుతుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చివరికి అసలు హంతకుడిని పట్టిస్తుంది.

స్టోరీగా చూస్తే ఇదో మాములు క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు శరన్ కోపిశెట్టి దీన్ని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో నడిపించడంలో తడబడ్డాడు. ఇన్వెస్టిగేషన్ మరీ నెమ్మదిగా సాగడంతో వేగం కోరుకునే ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారు. స్పెషల్ ఆఫీసర్ గా ఈషా చావ్లా ఎంట్రీ తర్వాత కూడా కథనం స్లోగానే వెళ్ళడంతో ఎగ్జైట్ మెంట్ అంతకంతా తగ్గిపోతుంది.

ఎంత రొటీన్ గా ఉన్నా పరవాలేదనుకుంటే తప్ప చీకటిలో లీనమవ్వడం కష్టం. పెర్ఫార్మన్స్ పరంగా శోభిత ఓకే అనిపించుకుంది. సాలిడ్ కంబ్యాక్ అయ్యే అవకాశాన్ని చీకటిలో ఇవ్వకపోవచ్చు కానీ ఇలాంటి జానర్ లో బలమైన సబ్జెక్టులు చేస్తే మాత్రం మంచి ఇన్నింగ్స్ నిర్మించుకోవచ్చు.

Related Post

ఇంతకీ విశ్వంభర ఏం చేస్తున్నట్టుఇంతకీ విశ్వంభర ఏం చేస్తున్నట్టు

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న విశ్వంభర రిలీజ్ డేట్లు మార్చుకుంటూ చివరికి వచ్చే ఏడాది విడుదలకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్ పోన్ ప్రకటన వచ్చి కూడా నెలలు దాటిపోయింది. దాని తర్వాత టీమ్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. దర్శకుడు వసిష్ఠ తరచుగా

నా ముందు అధ్యక్షా అనలేకనే…నా ముందు అధ్యక్షా అనలేకనే…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి హాజరుపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని ఆయన అన్నారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే ఇస్తామన్నారు. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టం లేకనే

ఓట‌మికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకేఓట‌మికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకే

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌స్తామ‌నిప్ర‌క‌టించిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఆశించిన విధంగా ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోలేక పోయారు. క‌నీసం 234 మంది అభ్య‌ర్థుల‌ను నిలబెట్టినా ఒక్క చోట కూడా.. ఆయ‌న డిపాజిట్ ద‌క్కించుకోలేక పోయారు. అయితే.. ఓట్లు