hyderabadupdates.com Gallery ముందుండి న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట

ముందుండి న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట

ముందుండి న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట post thumbnail image

అమరావతి : ప‌ని చేయ‌డ‌మే కాదు ప‌ని చేయించ‌డంలో నాయ‌క‌త్వ ప‌టిమ క‌లిగిన అరుదైన నాయ‌కుడు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. డిన్నర్ విత్ రియల్ విన్నర్స్ సమావేశంలో సీఎం పనితీరును వివరించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, అధికారుల వెంటపడి టాస్క్ పూర్తి చేయించే విధానాన్ని వివరించారు. పరిపాలనలోనూ.. రాజకీయాల్లోనూ ఎలాంటి ఇగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాలు అని వ్యాఖ్యానించారు . పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో, పారిశ్రామిక వేత్తలను కలిసే విషయంలో ఇగోలను పక్కన పెట్టి టీమ్ స్పూర్తితో పని చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో 1995-1999 పాలన గురించి చెబుతారని, ఇకపై 2024-29 పాలన గురించి చెప్పుకునేలా పని చేస్తామని ప్ర‌కటించారు నారా లోకేష్.
మంత్రులు, అధికారులు ఒక టీంగా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. లక్ష్యాన్ని చేరుకున్న ప్రతీసారి మంత్రులకు ముఖ్యమంత్రి కొత్త లక్ష్యాన్ని నిర్ధేశిస్తారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను, సంస్క‌ర‌ణ‌ల‌కు తీసుకు వ‌చ్చిన అరుదైన నాయ‌కుడు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు. ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంట‌ర్ ను ఏపీకి తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని అన్నారు నారా లోకేష్‌. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. అనుమ‌తుల‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు నారా లోకేష్‌. దీని వ‌ల్ల పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు.
The post ముందుండి న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీకొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్‌స్ట్రక్షన్స్ కొండ‌ల‌ను త‌వ్వుతోంద‌ని ఆరోపించారు. అనుమ‌తులు లేకుండా త‌వ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు. రేవంత్

క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్క్రెడిట్ చోరిలో జగన్ ది 5జీ స్పీడ్ : వాసం శెట్టి సుభాష్

అమ‌రావ‌తి : రాష్ట్రంలో “క్రెడిట్ చోరీ” అనే కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ముందుగానే

అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్

ఇరాన్ : మ‌రో యుద్దానికి తెర తీయ‌నున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయ‌న గ‌త కొంత కాలంగా ప‌లు దేశాలపై పెత్త‌నం చెలాయించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య‌న ఇండియాను బెదిరించారు. ర‌ష్యాతో సంబంధం తెంచు కోవాల‌ని ఒత్తిడి చేశాడు.