hyderabadupdates.com Gallery మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి post thumbnail image

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా క‌ళాశాల‌, హాస్టల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడి విద్యా సంస్థలలో సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. టిటిడి పాలక మండలి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 3,106 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తుండగా, వారిలో 2,350 మంది హాస్టల్ వసతి పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులలో మెరుగైన ప్రతిభ కలిగినవారు, సగటు స్థాయి, తక్కువ స్థాయి, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థినులను గుర్తించి, సమతుల్య గ్రూపులుగా విభజించి బోధన నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తూ ముందుకు సాగితే వంద శాతం ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులు బాధ్యత వహించాలన్నారు.
బోధన ప్రమాణాలు, వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై విద్యార్థినుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకు రావాలని సూచించారు. అనంతరం వారితో కలిసి హాస్టల్‌లో భోజనం చేసి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణ దేవారాయుల కాలానికి చెందిన పురాతన బావిని పరిశుభ్రం చేసి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ కాంతులు , భక్తి భావాన్ని పెంపొందించే మ్యూజిక్ వాతావరణం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి వైభవంతో పాటు దేశం, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలను తెలియజేసే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డా. భద్రమణి, వార్డెన్ డా. మల్లీశ్వరి, అధ్యాపకులు, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
The post మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలుPonnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar)…చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ను ఉద్దేశించి… పొన్నం (Ponnam Prabhakar)

సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..?సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..?

చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఆశించిన మేర రాణిండ‌చం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మెగా టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడింది. ప్రారంభ మ్యాచ్ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌గా ఆర్సీబీ చేతిలో

జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణజ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణ

విజ‌య‌వాడ : జ‌న‌సేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాస‌లీల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని ప‌ట్ల ఆయ‌న అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో బాధితురాలు ధైర్యంగా