hyderabadupdates.com Gallery రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి నోరు విప్పారు. ఆయ‌న ఏబీఎన్ రాధాకృష్ణ‌పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి టెండ‌ర్ల ర‌ద్దుపై స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నిప్పులు చెరిగారు రాధాకృష్ణ‌. ఆధారాలు లేకుండా ఎలా దుష్ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇలాగే నువ్వు గీత దాటితే ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు సైతం తాను వెనుకాడ‌బోనంటూ స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని అనుమానం వ్య‌క్తం చేశారు. రాధాకృష్ణ తొలి పలుకుల నినాదం వెనుక ఎవరి హస్తం ఉందో తానే చెప్పాల‌న్నారు. ఏ రాబందులా? ఏ గద్దల? ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు ప్ర‌సారం చేశార‌నేది తేలాల్సి ఉంద‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావు లేద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగా నిలిచిన సింగరేణి సంస్థపై పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలతో రాధాకృష్ణ చేస్తున్న తొలి పలుకు కథనాలు సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య చర్యలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియాకు కూడా హ‌ద్దు అనేది ఉంటుంద‌న్నారు. దానిని గ‌మ‌నించి న‌డుచు కోవాల‌ని హిత‌వు ప‌లికారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.
The post రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

    దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు జైపుర్, లఖ్‌నవూ, వారణాసి, ఇతర

CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్

    పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే