hyderabadupdates.com Gallery రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది post thumbnail image

మంగ‌ళ‌గిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్‌లా మారాయంటూ ఫైర్ అయ్యారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన పాలనను సీఎం చంద్రబాబు సరి చేస్తున్నారని చెప్పారు. బూతులు తిట్టడం, అనైతిక వ్యాఖ్యలు చేయడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ రాజకీయ సిద్ధాంతం అన్నారు. అధికారంలో ఉఉన్నా అధికారం లేకపోయినా ఇదే సిద్ధాంతాన్ని జగన్ అమలు చేస్తున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రాభివృద్ధి అన్నా, తెలుగు వాళ్ల అభివృద్ధి అన్న జగన్‌కు గిట్టద‌న్నారు. విద్వేషాలు, విధ్వంసాలతో రాజకీయం చేయడం వైసీపీ డీఎన్ఏలోనే ఉంద‌న్నారు స‌త్య ప్ర‌సాద్.
మాట చాలా శక్తివంతమైనద‌ని, మంచి మాట ఐక్యతను, చెడు మాట అశాంతిని పెంచుతుందని వైసీపీ నాయకులు గ్రహించాలని హిత‌వు ప‌లికారు. అమరావతి రైతులను దూషించడం, మండలి ఛైర్మన్‌పై దాడి చేయడం వైసీపీ రాజకీయ స్వభావానికి నిదర్శనం అన్నారు. . తోట చందయ్యను గొంతు కోసి చంపేశారు. అమర్ అనే 14 ఏళ్ల బాలుడి హత్య చేశారు. వాళ్ల ప్రకారం తాము ప్రతికార్య చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్. ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా పని చేస్తున్నాం. ఆ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకున్నాం అని చెప్పారు.
The post రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులుBomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

  ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేళుళ్ళతో దేశం అట్టుడుకుతున్న వేళ… పలు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండగులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపారు. అందులో దిల్లీ, కోల్‌కతా,

సీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదుసీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం ఎలాంటి పోరు లేద‌న్నారు. త‌న‌తో పాటు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కూడా సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి