hyderabadupdates.com Gallery రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు స‌మాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామ‌ని చెప్పారు. విద్యుత్ లైన్లు వేసిన తరువాత వాటి కింద ఇళ్ల నిర్మాణంతోనే భద్రతా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అవగాహన లోపం, లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాదంగా మారిన విద్యుత్ లైన్లు గుర్తిస్తే అధికారులకు సమాచారం వెంట‌నే అందించాల‌ని కోరారు.
లైన్లు, స్తంభాల మార్పిడికి సంబంధీకులు దరఖాస్తు చేస్తే లైన్లు మార్చుతామ‌ని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి. విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎంపీ నిధుల ద్వారా లైన్ల మార్పిడి చేపట్టామ‌ని తెలిపారు. ప్రాణాల కంటే ఏదీ విలువైంది కాదని అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించామ‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ఇదిలా ఉండ‌గా ఎక్కువ‌గా రైతులు పామాయిల్ తోటల్లో కోత కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ప్రతీ జిల్లాకు రూ. కోటి మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వకూడద‌ని స్పష్టం చేశారు.
The post రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌

    అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు.

Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?

    చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్‌ ముజమ్మిల్‌ గనయీ పదేపదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా?.. దీంతో వచ్చే నెల

Anil Ambani: రూ.7,500 కోట్ల విలువైన అనిల్‌ అంబానీ ఆస్తులను జప్తు చేసిన ఈడీAnil Ambani: రూ.7,500 కోట్ల విలువైన అనిల్‌ అంబానీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

    అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థలకు సంబంధించిన రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అక్టోబరు 31న ఈడీ ప్రకటించింది. ఈ ఆస్తుల్లో అనిల్‌ అంబానీ