hyderabadupdates.com Gallery రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు

రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు

రూ. 10  కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు post thumbnail image

హైద‌రాబాద్ : ఓ వైపు డ్ర‌గ్స్ కేసు ఇంకో వైపు బెదిరింపు, రూ. 10 కోట్ల మోసానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేసిన త‌ర్వాత తీవ్రంగా స్పందించింది సింగ‌ర్ మంగ్లీ. ఆమె మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తన‌కు ఏ పాపం తెలియ‌ద‌ని, తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌కు ఇంకొక‌రిని మోసం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అయితే ఇండ‌స్ట్రీలో తన‌కున్న జ‌నాద‌ర‌ణ‌ను కొంద‌రు కావాల‌ని క్యాష్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు వాపోయింది. దీనికి తాను ఏం చేయ‌గ‌ల‌నంటూ ప్ర‌శ్నించింది . ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందడానికి , అధిక రాబడులు ఇస్తామని వాగ్దానం చేసే పథకాన్ని ప్రచారం చేయడానికి త‌న పేరు త‌న‌కు తెలియ‌కుండా వాడుకున్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేసింది సింగ‌ర్ మంగ్లి.
తాను ఎలాంటి మైక్రో ఫైనాన్స్ మోసానికి పాల్ప‌డ‌లేద‌ని , తాను ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది ఈ చిన్న‌ది. అయితే స‌ద‌రు మోసంతో తనను ముడి పెడుతున్న ఆరోపణలను ఖండించింది. అవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌ని, అవాస్త‌వ‌మ‌ని, కావాల‌ని తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఉద్దేశించినవని అన్నారు. అయితే సుబ్బారావు అనే అడ్వ‌కేట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంగ్లీపై. ఆమె సోద‌రుడు శివ‌, ఇంకొంద‌రు క‌లిసి త‌న వ‌ద్ద నుంచి రూ. 10 కోట్లు తీసుకున్నార‌ని ఆరోపించారు. దీనిని ఖండించారు సింగ‌ర్ మంగ్లీ. తన గుర్తింపును దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
The post రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్యRohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

      ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల

రేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డిరేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డి

కరీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టంశ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో